Telangana Postponed Summative Assessment Exams: తెలంగాణ (Telangana News) విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకూ త్వరలో నిర్వహించనున్న ఎస్ఏ - 2 (Summative Assessment - 2) పరీక్షలను వాయిదా వేసింది. ఈ ఎగ్జామ్స్ ఈ నెల 15కి వాయిదా వేస్తున్నట్లు విద్యా శాఖ అధికారులు గురువారం ప్రకటించారు. దీని ప్రకారం ఈ నెల 15 నుంచి 22 వరకూ ఎస్ఏ - 1 పరీక్షలు జరగనున్నాయి. 23న పరీక్షా ఫలితాలు ప్రకటించి.. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించనున్నారు. కాగా, ఒకటి నుంచి ఏడో తరగతి వరకూ ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకూ.. 8వ తరగతికి ఉదయం 9 గంటల నుంచి 11:45 వరకు, 9వ తరగతికి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. డీఈవోలు, అన్ని స్కూళ్ల యాజమాన్యాలు, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని ఉన్నతాధికారులు సూచించారు. ఏప్రిల్ 2తో పదో తరగతి పరీక్షలు ముగియగా.. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు ఒంటిపూట బడులు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 24 స్కూళ్లకు చివరి పని దినం కాగా.. ఈ నెల 25 నుంచి జూన్ 11 వరకు వేసవిసెలవులు ప్రకటించారు. విద్యా శాఖ ఈసారి మొత్తం 45 రోజులు వేసవి సెలవులు ప్రకటించింది.


Also Read: Telangana News: తెలంగాణలో ఆ 2 రోజులు వర్షాలు - మండే ఎండల్లో కూల్ న్యూస్ చెప్పిన వాతావరణ శాఖ