ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్య కేంద్రంలో డిగ్రీ, పీడీ, డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబరు 20 వరకు అవకాశం ఉందని డైరెక్టర్ ప్రొఫెసర్ బీబీ రెడ్డి తెలిపారు. యూకేపీ ఆదేశాల మేరకు దరఖాస్తుల గడువును పొడిగించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటిదాకా దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.



వివరాలు..


* ఓయూ దూరవిద్య ప్రవేశాలు


1) పీజీ కోర్సులు


➥ ఎంబీఏ 


➥ ఎంసీఏ


➥ ఎంఏ


విభాగాలు: హిందీ, ఉర్దూ, తెలుగు, సంస్కృతం, ఇంగ్లిష్, ఫిలాసఫీ, సోషియాలజీ, పబ్లిక్ పర్సనల్ మేనేజ్‌మెంట్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ.


➥ ఎంకామ్


➥ ఎంఎస్సీ


విభాగాలు: మ్యాథమెటిక్స్, స్టాటిటిక్స్.


అర్హత: ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి. ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు టీఎస్‌ఐసెట్/ఏపీ ఐసెట్ అర్హత తప్పనిసరి.


2) డిగ్రీ కోర్సులు


➥ బీఏ


➥ బీఏ (మ్యాథమెటిక్స్, స్టాటిటిక్స్)


➥ బీకామ్ (జనరల్)


➥ బీబీఏ


అర్హత: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. 


3) అడ్వాన్స్‌డ్ డిప్లొమా కోర్సులు


విభాగాలు: మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్, బిజినెస్ మేనేజ్‌మెంట్, బయోఇన్‌ఫర్మాటిక్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, డేటా సైన్స్, ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ డెవలప్‌మెంట్, వేదిక్ ఆస్ట్రాలజీ.


అర్హత: ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి. వేదిక్ ఆస్ట్రాలజీ కోర్సుకు సంబంధిత విభాగంలో డిప్లొమా/పీజీ డిప్లొమా లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.


4) డిప్లొమా (వేదిక్ ఆస్ట్రాలజీ)


అర్హత: ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి. 


5) సర్టిఫికేట్ కోర్సు (యోగా)


అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. 


దరఖాస్తుకు చివరితేది: 20.10.2023.


Notification


Online Application


Website


ALSO READ:


అంబేడ్కర్ వర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు మరోసారి పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ), పీ.జీ(ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్‌సీ, ఎంఎల్ఐఎస్‌సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్) కోర్సుల్లో ప్రవేశాల గడువును అధికారులు మరోసారి పొడిగించారు. అక్టోబరు 4తో గడువు ముగియగా.. ప్రవేశాలు పొందేందుకు అక్టోబరు 20 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. అభ్యర్థులు అక్టోబరు 20 వరకు ఎలాంటి ఆలస్య రుసుము చెల్లించాల్సిన అవసరంలేదు. ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను సమీపంలోని అధ్యయన కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. 
ప్రవేశాలకు సంబంధించిన పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


బీపీటీ, బీఎస్సీ పారామెడికల్ కోర్సులకు నోటిఫికేషన్ విడుదల
ఏపీలో 2023-24 విద్యాసంవత్సరానికి బీపీటీ, బీఎస్సీ పారా మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశానికి డా.వైఎస్సార్‌ హెల్త్ యూనివర్సిటీ అక్టోబరు 8న నోటిఫికేషన్ విడుదల చేసింది. బీపీటీతో పాటు వివిధ బీఎస్సీ పారామెడికల్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో కాంపిటెంట్‌ అథారిటీ కోటా సీట్ల భర్తీకి అక్టోబర్‌ 8 నుంచి 19 వరకు అర్హులైన ఇంటర్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోగా దరఖాస్తులు సమర్పించాలి.
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...