2019 బ్యాచ్‌ ఎంబీబీఎస్‌ ఫైనలియర్‌ విద్యార్థులకు నిర్వహించాల్సిన నేషనల్‌ ఎగ్జిట్‌ టెస్ట్‌‌ను వాయిదా వేస్తున్నట్టు నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ గురువారం (జులై 13న) ప్రకటించింది. కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ నుంచి తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు నెక్ట్స్‌ను వాయిదా వేస్తున్నట్లు ఎన్‌ఎంసీ తెలిపింది. అయితే జులై 28న నిర్వహించాల్సిన మాక్‌ నెక్స్ట్‌ పరీక్ష నిర్వహణపై మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. 


నెక్ట్స్‌ మార్గదర్శకాలను ఎన్‌ఎంసీ ఇటీవలే విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఏటా రెండు దశల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు. పీజీ వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు, దేశంలో వైద్యుడిగా ప్రాక్టీస్‌ చేసుకునేందుకు నెక్ట్స్‌ ఉత్తీర్ణత తప్పనిసరి. విదేశాలకు చెందిన మెడికల్‌ గ్రాడ్యుయేట్లు భారత్‌లో ప్రాక్టీస్‌ చేసుకోవాలన్నా నెక్ట్స్‌లో ఉత్తీర్ణత కావాల్సిందే. రెండు దశలతోపాటు ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేయాల్సి ఉంటుంది. 


ఎంబీబీఎస్‌ 2019 బ్యాచ్‌ ఫైనలియర్‌ విద్యార్థులకు 'నేషనల్‌ ఎగ్జిట్‌ టెస్ట్‌ (నెక్ట్స్)' వచ్చే ఏడాది రెండు దశల్లో నిర్వహిస్తారు. మొదటిదశ  పరీక్షలో చూపిన ప్రతిభను పీజీ కోర్సుల్లో ప్రవేశానికి పరిగణనలోకి తీసుకొంటామని నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌.. ఎథిక్స్‌ అండ్‌ మెడికల్‌ రిజిస్ట్రేషన్‌ బోర్డు సభ్యుడు డాక్టర్‌ యోగేందర్‌ మాలిక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్న్‌షిప్‌ తర్వాత నెక్ట్స్ రెండోదశ (స్టెప్-2)ను పూర్తి చేయాల్సి ఉంటుంది. రెండు దశలు పూర్తిచేసినవారు భారత్‌లో ఆధునిక వైద్య ప్రాక్టీసుకు లైసెన్స్, రిజిస్ట్రేషన్ పొందేందుకు అర్హులవుతారు. 


ALSO READ:


అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సులు - వివరాలు ఇలా!
అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ), పీజీ(ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ), బీఎల్ఐఎస్‌సీ, ఎంఎల్ఐఎస్‌సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కోర్సులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు జులై 31లోపు తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను సమీపంలోని అధ్యయన కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు. మరిన్ని వివరాలకు 7382929570/580/590/600, 040-23680290/ 291/294/295 నంబర్లలో సంప్రదించవచ్చు.
కోర్సుల పూర్తివివరాలు, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి.. 


తెలుగులోనూ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష! ఐఐటీ కౌన్సిల్‌లో నిర్ణయం!
జాయింట్‌ ఎంట్రన్స్ ఎగ్జామ్‌(జేఈఈ) అడ్వాన్స్‌డ్‌‌కు హాజరయ్యే తెలుగు విద్యార్థులకు కేంద్రప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. నీట్‌, జేఈఈ మెయిన్‌ తరహాలోనే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షనూ తెలుగు సహా 11 ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఐఐటీ కౌన్సిల్‌, ఐఐటీ ఢిల్లీని ఆదేశించింది. ప్రధానంగా ఐఐటీల్లో డ్రాపౌట్ల నివారణకు తీసుకోవల్సిన చర్యలపై ఐఐటీ కౌన్సిల్‌ దృష్టి పెట్టింది. డ్రాపౌట్స్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసి  నివేదికను ఇవ్వాలని ఐఐటీ ఖరగ్‌పూర్‌ను కౌన్సిల్‌ ఆదేశించింది. గత ఏప్రిల్‌లో జరిగిన ఐఐటీ కౌన్సిల్‌ మీటింగ్‌కు సంబంధించిన  తీర్మానాలను కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial