హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్‌ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) అరుదైన ఘనత సాధించింది. అసోసియేషన్‌ ఆఫ్‌ ఎంబీఏ(ఏఎంబీఏ) నుంచి మరోసారి గుర్తింపు(రీ అక్రిడేషన్‌) పొందినట్లు ఐఎస్‌బీ తెలిపింది. దీంతో దేశంలోని అత్యుత్తమ బిజినెస్‌ స్కూళ్లలో ఒకటిగా ఐఎస్‌బీ సత్తా చాటింది.


ఈ సందర్భంగా ఐఎస్‌బీ డిప్యూటీ డీన్‌ ఆచార్య రామభద్రన్‌ తిరుమలై మాట్లాడుతూ.. తాము అందిస్తున్న ప్రపంచస్థాయి బోధన, లోతైన పరిశోధన, నిపుణులైన అధ్యాపక వర్గం, అంతర్జాతీయ స్థాయి వసతులు సంస్థను ఉన్నతంగా నిలుపుతున్నాయన్నారు. ఈ క్రమంలో తమ సంస్థకు వరుసగా గుర్తింపు లభిస్తోందని చెప్పారు. 


ఐఎస్‌బీ.. ఏఎంబీఏతో పాటు ఈఎంఎఫ్‌డీ క్వాలిటీ ఇంప్రూవ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఈక్విస్‌), ఆసోసియేషన్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌ కాలేజియెట్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఏఏసీఎస్‌బీ) నుంచి గుర్తింపులను సొంతం చేసుకున్నట్లు తెలిపారు.


ఏఎంబీఏ గుర్తింపు సాధించడంతో ఐఎస్‌బీ ప్రస్తుత, పూర్వ విద్యార్థులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు.  విద్యార్థుల ఉద్యోగావకాశాల్లో వృద్ధి, వారికి దేశవిదేశీ నెట్‌ వర్కింగ్‌, 150 దేశాలకుపైగా 60 వేల మంది విద్యార్థులతో కూడిన ఏఎంబీఏ ప్రపంచ సంఘంలో చేరేందుకు అవకాశం లభిస్తుందని రామభద్రన్‌ తెలిపారు.


ALSO READ:


నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఫైర్‌ & సేఫ్టీ ఇంజినీరింగ్‌లో ప్రవేశాలు, కనీస అర్హత ఇంటర్
నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఫైర్‌, సేఫ్టీ ఇంజినీరింగ్‌ ఆధ్వర్యంలో ఫైర్‌, హెల్త్‌ సేఫ్టీ కోర్సుల్లో గ్రేటర్‌  పరిధిలోని విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్‌ వెంకట్‌రెడ్డి అక్టోబరు 8న ఒక ప్రకటనలో తెలిపారు. పీజీ డిప్లొమా ఇన్‌ ఫైర్‌ సేఫ్టీ ఇంజినీరింగ్‌, ఫైర్‌ టెక్నాలజీ, ఇండస్ట్రియల్‌ సేఫ్టీ, సబ్‌ ఫైర్‌ ఆఫీసర్‌, హెల్త్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌, డిప్లొమా ఇన్‌ ఫైర్‌ సేఫ్టీ ఇంజినీరింగ్‌లో శిక్షణ ఉంటుందన్నారు. శిక్షణ పూర్తయ్యాక పరిశ్రమలు, ఎయిర్‌పోర్టు, ఆయిల్‌ కంపెనీలు, గ్యాస్‌, ఫార్మా ఇండస్ట్రీస్‌, రైల్వేస్‌ సంస్థలలో అవకాశాలు లభిస్తాయని వివరించారు.  ఆసక్తి ఉన్నవారు అక్టోబరు 18 లోపు వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 97014 96748 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చు.
కోర్సుల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి.. 


అజీమ్ ప్రేమ్‌జీ వర్సిటీలో డిగ్రీ కోర్సులు, వివరాలు ఇలా!
అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ బెంగళూరు, భోపాల్‌లోని క్యాంపస్‌లలో 2023-24 విద్యా సంవత్సరానికి పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగాల్లో డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు నవంబరు 22లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా సీటు కేటాయిస్తారు. 
కోర్సు వివరాల కోసం క్లిక్ చేయండి..


వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు 'స్పాట్‌' కౌన్సెలింగ్‌, ఎప్పుడంటే?
గుంటూరులోని ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో 2023-24 విద్యాసంవత్సరానికి వివిధ కోర్సుల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి అక్టోబర్ 11న స్పాట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఈమేరకు వర్సిటీ రిజిస్ట్రార్‌ జి.రామారావు అక్టోబరు 6న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కౌన్సెలింగ్ ద్వారా ఇంజినీరింగ్, పాలిటెక్నిక్‌ కళాశాలల్లో వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం, విత్తన సాంకేతిక పరిజ్ఞానం కోర్సుల్లో మిగిలిపోయిన సీట్లను భర్తీ చేయనున్నారు. గుంటూరులోని లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం లాంఫాం పాలిటెక్నిక్‌ విభాగంలో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...