ఆంధ్రప్రదేశ్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ (సీపెట్) ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణకు దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైనవారికి మెషీన్‌ ఆపరేటర్‌-ప్లాస్టిక్స్‌ ప్రాసెసింగ్‌ విభాగాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందిస్తున్నట్లు కేంద్ర పెట్రోకెమికల్స్‌ ఇంజినీరింగ్‌, టెక్నాలజీ సంస్థ(సీపెట్‌) జేడీ సీహెచ్‌ శేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.


శిక్షణ అనంతరం సర్టిఫికెట్‌తోపాటు అనంతపురం, హైదరాబాద్‌, బెంగళూరు, హోసూర్‌, చెన్నై ప్రాంతాల్లో ప్రముఖ ప్లాస్టిక్స్‌, అనుబంధ సంస్థల్లో ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడించారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి సదుపాయాలు ఉంటాయి. పదోతరగతి ఉత్తీర్ణులైనవారు అర్హులు. ఫోన్‌ నంబరు 6300147965 ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని, ఆగస్టు 11 నుంచి శిక్షణ ప్రారంభమవుతుందని వెల్లడించారు.


వివరాలు..


* స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు


సీట్ల సంఖ్య: 30


కోర్సు..


* మెషీన్‌ ఆపరేటర్‌- ప్లాస్టిక్స్‌ ప్రాసెసింగ్‌. 


అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణులైన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు. 


శిక్షణ ప్రారంభం: ఆగస్టు 11.


సంప్రదించాల్సిన ఫోన్ నెంబరు: 63001 47965.


గమనిక: శిక్షణకు ఎంపికైనవారికి ఉచిత శిక్షణ, వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తారు. యూనిఫామ్, సేఫ్టీ షూస్, ట్రైనింగ్ కిట్ ఉచితంగా ఇస్తారు. ఇక విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారికి ఎన్‌ఎస్‌క్యూఫ్ నుంచి సర్టిఫికేట్‌తోపాటు అనంతపురం, హైదరాబాద్‌, బెంగళూరు, హోసూర్‌, చెన్నై ప్రాంతాల్లో ప్రముఖ ప్లాస్టిక్స్‌, అనుబంధ సంస్థల్లో ఉద్యోగాలు కల్పించనున్నారు.


ALSO READ:


'గేట్‌-2024' షెడ్యూలు వచ్చేసింది, ఆగస్టు 24 నుంచి దరఖాస్తుల స్వీకరణ, ఈసారి కొత్త పేపరు జోడింపు!
దేశంలోని ఐఐటీలతోపాటు ఇతర ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు ఏటా నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్(GATE-2024) దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 24 నుంచి ప్రారంభంకానుంది. ఈసారి గేట్ నిర్వహణ బాధ్యతను బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌(ఐఐఎస్‌సీ) చేపట్టింది. 'గేట్‌'లో ఇప్పటివరకు మొత్తం 29 ప్రశ్నపత్రాల్లో పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి కొత్తగా డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(డీఏ) ప్రశ్నపత్రాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీంతో గేట్ పరీక్షలో మొత్తం పేపర్ల సంఖ్య 30కి చేరినట్లయింది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


ఆర్‌ఐఎంసీలో 8వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌, వివరాలు ఇలా!
డెహ్రాడూన్‌‌లోని రాష్ట్రీయ ఇండియన్‌ మిలిటరీ కాలేజ్‌(ఆర్‌ఐఎంసీ)లో ఎనిమిదో తరగతి (2024 జులై సెషన్) ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. స్థానిక బాలురు, బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, వైవా, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. సరైన అర్హతలున్న విద్యార్థులు అక్టోబరు 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. వీరికి డిసెంబరు 2న ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


నవోదయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ - పరీక్ష విధానం, ఎంపిక, అర్హతల వివరాలు ఇలా!
జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2024-25 విద్యాసంవత్సరాకిగాను ఆరోతరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ ఏడాది రెండు విడతల్లో ఎంపిక పరీక్ష నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 20న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో ఈ ఏడాది నవంబరు 4న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో అర్హత సాధిస్తే చాలు.. ఇంటర్‌ దాకా ఉచితంగా చదువు, వసతి, భోజనం కల్పిస్తారు. బోధన కూడా అత్యున్నత ప్రమాణాల్లో ఉంటుంది. ప్రవేశ పరీక్షకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 19న ప్రారంభంకాగా, ఆగస్టు 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.  
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..