సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 12వ తరగతి ఫలితాలను ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు వెల్లడించనున్నట్లు బోర్డు ప్రకటించింది. కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్రమవుతోన్న నేపథ్యంలో సీబీఎస్ఈ బోర్డు పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 12వ తరగతి ఫలితాలను నేడు వెల్లడించనుంది. 



ఫలితాలను సీబీఎస్ఈ అధికారిక వెబ్ సైట్ cbseresults.nic.in, cbse.gov.in ద్వారా వెల్లడించనుంది. ఫలితాలను చెక్ చేసుకునేందుకు విద్యార్థులు వారి రోల్ నంబర్, ఇతర క్రెడెన్షియల్స్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.