AP SSC Results 2022 : ఏపీలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. పదో తరగతి పరీక్షల ఫలితాలను నేటి మధ్యాహ్నం (జూన్ 6)న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పదో తరగతి ఫలితాలు విడుదల చేశారు. విజయవాడ ఎమ్‌జీ రోడ్డు వద్ద నున్న గేట్‌వే హోటల్‌ లో ఫలితాలు విడుదల కార్యక్రమం నిర్వహించారు. వాస్తవానికి గత శనివారం (జూన్ 4న) టెన్త్ రిజల్ట్స్ విడుదల కావాల్సి ఉండగా, చివరి నిమిషంలో ఫలితాలు వాయిదా పడ్డాయి. ఏపీ టెన్త్ ఎగ్జామ్స్ రాసిన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ www.results.bse.ap.gov.in లో సోమవారం తమ ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చని విద్యాశాఖ స్పష్టం చేసింది. వచ్చేనెల 6 నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు అని మంత్రి బొత్స తెలిపారు.


బాలికలదే పైచేయి..
ఈ ఏడాది సైతం బాలురి కంటే బాలికలదే పైచేయి. ఫలితాలను కేవలం మార్కుల రూపంలో విడుదల చేశారు. మొత్తం 4.14 లక్షల మంది విద్యార్తులు టెన్త్ క్లాస్ పాసయ్యారు. టెన్త్ ఫలితాలలో సరాసరి 67.26 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ప్రకాశం జిల్లాలో అత్యధిక శాతం 78.3 శాతం విద్యార్థులు మంది ఉత్తీర్ణులవగా, అనంతపురం 49.7 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది. 64.02 శాతం మంది బాలురు ఉత్తీర్ణత సాధించగా, బాలికలు 70.70 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఏపీ టెన్త్ రిజల్ట్స్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్


రిజల్ట్స్ ఈసారి గ్రేడ్లు కాదు..  
ఈ ఏడాది ఏపీ టెన్త్ క్లాస్ పరీక్షలు ఏప్రిల్ 27నుంచి మే 9వరకు జరిగాయి. రెండేళ్ల తరువాత రాష్ట్రంలో టెన్త్ పరీక్షలు నిర్వహించగా.. దాదాపు 6,21,799 మంది విద్యార్థులు ఎగ్జామ్స్‌కు హాజరయ్యారు. ఏపీ టెన్త్ విద్యార్థుల బోర్డ్ ఎగ్జామ్స్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. కొవిడ్‌ వ్యాప్తి కారణంగా రెండేళ్లు (2019 తర్వాత ) పరీక్షలు జరగలేదు. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో విద్యార్థులకు ర్యాంకులు వచ్చినట్లు ఏ విధంగానూ ప్రచారం చేయకూడదని, ఈ సారి ఫలితాలను గ్రేడ్లకు బదులు మార్కుల రూపంలో ప్రకటిస్తున్నామని స్పష్టం చేశారు. తమ సూచనలు పాటించకుండా ఏవైనా విద్యా సంస్థలు, స్కూళ్లు కనుక ర్యాంకులు ప్రకటిస్తే వారు చట్టరీత్యా శిక్షార్హులని హెచ్చరించారు. టెన్త్ విద్యార్థులు తమ ఫలితాలను శనివారం నాడు అధికారిక వెబ్‌సైట్ లో చెక్ చేసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ సూచించింది. 


Also Read: Direct Linkతో రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి 


Also Read: Netflix Jobs: ఉద్యోగం చేయాలన్న మూడ్, ఉత్సాహం పోయిందట, రూ.3.5 కోట్ల ప్యాకేజీకి గుడ్‌బై