ఏపీలోని బీపీఎడ్‌, డీపీఎడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 31న నిర్వహించిన ఏపీ పీఈసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వీసీ రాజశేఖర్‌ జూన్ 16న ఫలితాలను  విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, పీఈసెట్ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేది వివరాలు నమోదుచేసి ర్యాంకు కార్డులు పొందవచ్చు. ఏపీ పీఈసెట్ పరీక్షలో మొత్తం 977 మంది ఉత్తీర్ణత సాధించారు. బాపట్ల జిల్లా చీరాలకు చెందిన మౌనిక తొలి ర్యాంకు సాధించగా.. అనంతపురం జిల్లా ఎర్రగుంట వాసి లక్ష్మీదేవికి రెండో ర్యాంకు, ప్రకాశం జిల్లా వాసి షేక్‌ మహ్మద్‌కు మూడో ర్యాంకులో నిలిచారు.


ఏపీ పీఈసెట్ ర్యాంకు కార్డుల కోసం క్లిక్ చేయండి..


ఏపీ పీఈసెట్ – 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలోని బీపీఎడ్‌, డీపీఎడ్ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే టీఎస్ పీఈసెట్-2023 నోటిఫికేష‌న్ మార్చి 18న విడుద‌లైన సంగతి తెలిసిందే. బీపీఈడీ కోర్సుకు డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు,  డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యేవారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఇక యూజీడీపీఈడీ కోర్సులకు ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అభ్యర్థులకు మే 31న పరీక్ష నిర్వహించారు. వీటికి సంబంధించిన ఫలితాలను తాజాగా విడుదల చేశారు.


Also Read:


ఏపీ లాసెట్‌ - 2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
ఆంధ్రప్రదేశ్‌లో లాసెట్‌, పీజీ ఎల్‌‌సెట్‌ - 2023 పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వీసీ రాజశేఖర్‌ జూన్‌ 16న ఫలితాలను విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. లాసెట్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను చూసుకోవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్‌టికెట్ నెంబరు వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. అదేవిధంగా రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఐసెట్ ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఏపీ లాసెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..


'దోస్త్'లకు సీట్ల కేటాయింపు, తొలి విడతలో 73,220 మందికి ప్రవేశాలు!
తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల‌కు సంబంధించి విద్యార్థులకు 'దోస్త్' తొలిదశ సీట్లను కేటాయించారు. మొద‌టి విడత‌లో 73,220 మంది సీట్లు కేటాయించిన‌ట్లు ఉన్నత విద్యామండ‌లి జూన్ 16న ఒక ప్రకటనలో తెలిపింది. సీట్లు పొందిన విద్యార్థుల్లో 44,113 మంది అమ్మాయిలు, 29,107 మంది అబ్బాయిలు ఉన్నారు. దోస్త్‌ ద్వారా ప్రవేశాలకు అందుబాటులో 889 కళాశాలలు ఉండగా.. వాటిల్లో  మొత్తం సీట్లు 3,56,258 సీట్లు ఉన్నాయి. ఇక 63 కళాశాలల్లో ఎలాంటి ప్రవేశాలు జరుగలేదు. డిగ్రీ కామ‌ర్స్ కోర్సుల్లో చేరేందుకే విద్యార్థులు సుముఖ‌త చూపించడం విశేషం. మొత్తం 33,251 మంది విద్యార్థులు కామ‌ర్స్ కోర్సుల‌ను ఎంపిక చేసుకున్నారు. సీట్లు పొందిన విద్యార్థుల జూన్ 16 నుంచి 25 వరకు సంబంధిత కళాశాలల్లో ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి.. 


ఏపీ ఐసెట్‌ ఫలితాలు విడుదల, ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోండి!
ఏపీ ఐసెట్ ఫలితాలు జూన్ 15న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు మే 24న ఈ పరీక్షను నిర్వహించారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ పరీక్ష జరిగింది. ఐసెట్‌లో విద్యార్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా 2023 విద్యా సంవత్సరానికి ఫుల్‌టైం ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఏపీలో 109, తెలంగాణలో 2 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షను 44 వేల మందికి పైగా విద్యార్థులు రాశారు. 
ఐసెట్ ర్యాంకు కార్డుల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..