Lovers Death in Bengaluru: ప్రేమించుకొని, కష్టపడి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందామని అనుకున్న ప్రేమ జంట చివరికి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ప్రియుడు రోడ్డు ప్రమాదంలో చనిపోగా, అది తట్టుకోలేని ప్రియురాలు ప్రాణాలు తీసుకుంది. ఈ కన్నీరు పెట్టించే ఘటన తుమకూరు తాలూకాలోని ఆరేహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఆరేహళ్లివాసి సుష్మా అనే 22 ఏళ్ల యువతి, యువకుడు ధనుష్ అనే 23 ఏళ్ల వ్యక్తి అని పోలీసులు తెలిపారు.


వారు వెల్లడించిన వివరాల ప్రకారం.. వీరు ఇద్దరూ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని ఇరు కుటుంబాల్లో ఈ విషయం చెప్పారు. కానీ, తొలుత పెద్దలు రెండు కుటుంబాల్లోనూ ఒప్పుకోలేదు. మొత్తానికి అనేక రకాల ప్రయత్నాలు చేసి పెద్దలను కూడా ఒప్పించారు. రెండు కుటుంబాల్లోనూ వారి వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ విధి మరోలా చేసింది.


వారి ఇద్దరు కుటుంబాలు పెళ్లికి సిద్ధం అవుతుండగా ప్రియుడు రోడ్డు ప్రమాదం జరిగింది. అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. దీంతో ప్రియురాలు ప్రియుడు లేని లోకం తనకు వద్దని ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ హృదయ విదారక సంఘటన కర్ణాటకలోని తుమకూరు తాలూకాలోని ఆరేహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది. యువతి ఆరేహళ్లివాసి సుష్మా (22), కాగా ప్రియుడు ధనుష్‌ (23) అని పోలీసులు తెలిపారు.


బట్టల షాపు నడుపుతున్న యువకుడు
మస్కల్‌ గ్రామానికి చెందిన ప్రియుడు ధనుష్‌ బెంగళూరులో బట్టల షాపు పెట్టుకున్నాడు. అక్కడే సుష్మాతో పరిచయమై అది సీరియస్ ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలనుకుని పెద్దలకు చెప్పగా మొదట్లో ఒద్దని అన్నారు. అయినా వారు వదలకుండా పట్టుబట్టి మరీ ఒప్పించారు. త్వరలోనే ముహూర్తాలు పెట్టుకోవాల్సి ఉంది. ఈ నెల 11వ తేదీన  గ్రామంలో జరిగే జాతరలో పాల్గొనడానికి ధనుష్‌ బైక్‌పై వస్తుండగా నెలమంగల దగ్గర ఉన్న కులానహళి వద్ద ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోయాడు. 


విషం తాగి యువతి ఆత్మహత్య
ప్రియుడి మరణ వార్త తెలిసిన సుష్మా తట్టుకోలేకపోయింది. ప్రియుడి ఆంత్యక్రియలకు కూడా వచ్చింది. అప్పటి నుంచి తనలో తానే కుమిలిపోతూ ఉండేది. తన ప్రియుడు లేని జీవితం ఇక వృథా అని భావించి ఆ మరుసటిరోజే పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రికి తరలించారు. ఆమెను కాపాడుకోవాలని సుమారు నాలుగైదు ఆస్పత్రులు తిప్పారు. అయినా ఫలితం లేకపోయింది. ఆదివారం ఉదయం చనిపోయింది.  దీంతో ఇరు కుటుంబాల్లోనూ తీవ్రమైన విషాద ఛాయలు అలుముకున్నాయి.