Warangal News: వరంగల్ జిల్లాలో ఘోరం జరిగింది. పెళ్లి జరిగిన మూడు వారాలకే ఓ భార్య తన భర్తపై కిరాతకానికి పాల్పడింది. బ్లేడుతో భర్త గొంతు కోసి హత్యాయత్నం చేసింది. పెళ్లైన మూడు వారాలకే నవ వధువు ఈ దారుణానికి ఒడిగట్టింది. రక్తపు మడుగులో ఉన్న అతణ్ని హుటాహుటిన వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం భర్త పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం… మామిడి శెట్టి రాజు అర్చనకు వివాహమై నేటికి సరిగ్గా నెల రోజులు అవుతోంది. రాజు మల్కపేటలోని ఓ క్రషర్ లో సూపర్ వైజర్ గా పని చేస్తున్నాడు. సోమవారం ఉదయం రాజు ఇంట్లో పడుకొని ఉండగా.. అర్చన బ్లేడ్ తో దాడి చేసింది. ఈ ఘటనలో రాజు మెడకు తీవ్ర గాయమైంది. వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు ఎంజీఎం తరలించారు. రాజుకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. 


(ఈ కథనం ఇంకా Update అవుతోంది)