వరంగల్ : ఉద్యోగాల పేరుతో మోసానికి పాల్పడిన నిందితుడిపై వరంగల్ పోలీస్ కమిషనర్ ఎ.వి రంగనాథ్ పీడీ యాక్ట్ ఉత్తర్వులను జారీ చేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రభుత్వ ఉద్యోగాలను ఇప్పిస్తానని యువతి యువకులను మోసం చేస్తున్న మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం అమ్మపాలేం చెందిన డాకురి భిక్షం పై వరంగల్ పోలీస్ కమిషనర్ జారీ చేసిన పీడీ యాక్ట్ ఉత్తర్వులను వర్ధన్నపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ గడ్డం సదన్ కుమార్ నిందితుడిని ఖమ్మం కారాగారానికి అప్పగించారు. అనంతరం నిందితుడిని చర్లపల్లి కారాగారానికి తరలించారు.


పీడీ యాక్ట్ అందుకున్న నిందితులు ఇద్దరు మరో ముగ్గురు నిందితులతో కల్ని ప్రభుత్వ ఉద్యోగాలను ఇప్పిస్తానని చదువుకున్న యువతి యువకులను మోసం చేసి వారి నుండి లక్షల్లో డబ్బు వసూళ్ళకు పాల్పడిన సంఘటనలో నిందితుడుని గతంలో వర్ధన్నపేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడూతూ చట్టవ్యతిరేక కార్య కలపాలకు పాల్పడే వ్యకులపైచట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు వారిపై పీడీయాక్ట్ క్రింద కేసులు నమోదు చేయబడుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు.


వ్యభిచారం ముసుగులో దోపీడీలకు పాల్పడుతున్న ముగ్గురు కిలేడీలు అరెస్ట్ 
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వ్యభిచారం మునుగులో దోపీడీలకు పాల్పడుతున్న ముగ్గురు మహిళలను మామునూరు పోలీసులు సోమవారం అరెస్టు చేయగా మరొ నిందితుడు పరారీలో ఉన్నాడు. వీరి వద్ద నుండి పోలీసులు 8వేల నాలుగు వందల రూపాయల నగదు, మూడు సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి ఈస్ట్రన్ డిసిపి వెంకటలక్ష్మీ వివరాలను వెల్లడించారు.


ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు వరంగల్ జిల్లా కొత్తూరు గ్రామానికి చెందిన విజయకుమార్, పర్వతగిరి ప్రాంతానికి చెందిన రాయపురం సరిత, కేసముద్రం ప్రాంతానికి చెందిన కోడం స్వరూప, నూనె స్వప్నలతో కల్సి ఒక ముఠా ఏర్పడి సులభంగా డబ్బు సంపాదించాలకున్నారు. ఇందులో భాగంగా ఈ ముఠాలో ముగ్గురు కిలాడీ లేడీలు బస్టేషన్లలో బస్ స్టేషన్లో అమాయకులైన యువకులను తమ సైగలతో వారిని ఆకర్షించి వారిని ప్రలోభ పెట్టి ఒక వెహికల్ ని కిరాయికి తీసుకొని వారితోపాటు ఆ విటుడుని కూడా ఎక్కించుకొని వరంగల్ నగర పరిసర గ్రామాలలో ఒక నిర్మానుష్యమైన ప్రాంతాలకు తీసుకు వెళ్తున్న సమయంలో ఆ ముఠా లోని మహిళలకు విజయ్ కుమార్ కు ఫోన్ ద్వారా రహస్యంగా సమాచారం చేరవేస్తారు. సమాచారం అందుకున్న నిందితుడు విజయ్ కిలాడీ లేడీలు ఉన్న ప్రాంతానికి చేరుకోని వారితో ఉన్న యువకులను బెదిరించి డబ్బులు వసూలు చేసేవారు.


ఈ విధంగా ఈ ముఠా మామునూరు పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదు అయినవి ఈ రెండు కేసులలో 20 వేల రూపాయల నగదు ఒక సెల్ ఫోను దోపిడీ చేశారు. గీసుకొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని ధర్మారం గ్రామంలో ఒక వ్యక్తి దగ్గర నుంచి 3000 నగదు మరియు 2000 రూపాయల విలువ గల ఫోన్ లను బలవంతంగా ఎత్తుకెళ్లారు. సోమవారం మామునూరు సిఐ క్రాంతి కుమార్ గారు తన యొక్క సిబ్బందితో సదరు ముగ్గురు మహిళ నిందితురాళ్ళను రాంగోపాలపురం వద్ద అరెస్టు చేశారు. ఈ ముగ్గురు నిందితులను పట్టుకోవడం ప్రతిభ కనబరిచిన మామునూరు ఏసిపి నరేష్ కుమార్, ఇన్సెస్పెక్టర్ క్రాంతికుమార్, ఎస్.ఐ. రాజేష్ రెడ్డి, కానిస్టేబుల్లు సర్థార్పోషా, రోజులను ఈస్ట్ జోన్ డిసిపి అభినందించారు.