రోజుల చిన్నారి మిస్సింగ్ కేసును వేములవాడ పట్టణ పోలీసులు గంటల వ్యవధిలో ఛేదించారు. బిడ్డను క్షేమంగా తల్లి ఒడికి చేర్చిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వద్ద మాములు రోజుల్లోనే విపరీతమైన రద్దీ ఉంటుంది. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు రాజన్న దర్శనం కోసం వచ్చి వసతి సౌకర్యాలు దొరకకుంటే ఎక్కడో ఒక ప్రాంతంలో తలదాచుకుంటారు. ఇలా దర్శనం కోసం వచ్చిన ఓ జంటకి చేదు అనుభవం ఎదురైంది.


 ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తలు 27 రోజుల బాలుడిని అపహారించారు. బాలుడి తల్లి లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు ఇన్స్పెక్టర్ వెంకటేష్ తెలిపారు. బాలుడి అపహరణ కి సంబందించిన వివరాలు డిఎస్పీ వెల్లడించారు. కరీంనగర్ శాంతినగర్ కు చెందిన లావణ్య భర్త తో విబేధాల కారణంగా తన ఇద్దరు కొడుకులు సనత్ కుమార్ (2), చిన్న బాలుడు (27 రోజులు )ను తీసుకొని గత నాలుగు రోజుల క్రితం వేములవాడ దేవాలయం వద్దకు వచ్చి ఒంటరిగా ఆలయ మెట్ల వద్ద ఉంటుంది. 


మెట్ల వద్ద తనకు సునీత మరియు ఆమె భర్త రవితేజలు పరిచయం అయ్యారు. ఆదివారం రాత్రి లావణ్య ఉదయం 3 గంటల ప్రాంతంలో వర్షం వచ్చేసరికి లేచి చూసుకోగా తన చిన్న కొడుకు కనిపించలేదు. పక్కన వున్న చాడి సునీత, చాడి అభితేజ @రవితేజ ఇద్దరు కూడా కనిపించలేదు. బాబును వారే ఎత్తుకెళ్లారు అని అనుమానంతో గుడి చుట్టూ వెతకగా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో ఉదయం 6గంటల ప్రాంతంలో పట్టణ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయగా వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా ఇన్స్పెక్టర్ వెంకటేష్ ఆలయ ప్రాంగణంలో ఉన్న సిసి ఫుటేజ్ పరిశీలించి అక్కడినుండి సమీపంలో ఉన్న అన్ని పోలీసు స్టేషన్ లకు సమాచార ఇవ్వటం జరిగిందని తెలిపారు. 


Also Read: Bank Of Baroda Theft Case: బ్యాంకులో చోరీ కేసులో కీలక పరిణామం, ఎట్టకేలకు కోర్టులో లొంగిపోయిన క్యాషియర్ ప్రవీణ్


సీసీ పుటేజీని పరిశీలిస్తూ బృందాలు దర్యాప్తులో భాగంగా వెళ్లగా వరంగల్ బస్టాండ్ లో బాలునితో సహా నిందితులను గుర్తించి పట్టుకున్నట్లు డిఎస్పీ చంద్రకాంత్ వెల్లడించారు.  గంటల వ్యవది లో ఇట్టి కేసు ను చేదించిన ఇన్‌స్పెక్టర్ వెంకటేష్ మరియు ఇతర పోలీసు సిబ్బంది ని అభినందించారు. వేములవాడ లాంటి రద్దీ ప్రాంతాలకు వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలని కొత్తవారితో జాగ్రత్తగా మెలగాలని పోలీసు ఉన్నతాధికారులు ప్రజలకు సూచించారు.