The Elephant Trampled Farmer In Manyam District: మన్యం జిల్లాలో (Manyam District) తీవ్ర విషాదం నెలకొంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమరాడ (Komarada) మండలం వన్నాం గ్రామంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఓ వృద్ధున్ని తొక్కి చంపేశాయి. స్థానిక వాగులో స్నానం చేసిన శివుడినాయుడు (62) అనే వృద్ధుడు తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న అరటి తోటలో ఏనుగుల గుంపును గమనించకుండా వెళ్లగా అతనిపై ఓ ఏనుగు దాడి చేసింది. తీవ్ర గాయాలతో వృద్ధుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం పంట పొలాల్లోనే ఏనుగుల గుంపు తిష్ట వేశాయి. ఈ క్రమంలో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కాగా, ఇటీవల మన్యం జిల్లాలో తరచూ ఏనుగుల దాడులు జరుగుతున్నాయి. అటవీ అధికారులు వీటిని నియంత్రించాలని గ్రామస్థులు కోరుతున్నారు.


Also Read: Ganja Siezed: తెలుగు రాష్ట్రాల్లో మత్తు కలకలం - ఏపీలో 912 కిలోల గంజాయి పట్టివేత, తెలంగాణ రూ.8.5 కోట్ల డ్రగ్స్ స్వాధీనం