Telangana News: రంగారెడ్డి జిల్లా నార్సింగ్​ పోలీస్ స్టేషన్ పరిధిలోని హత్యాచారం కేసు విషయంలో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.  2021లో రంగారెడ్డి కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ దోషి దినేష్​ కుమార్​ కు  హైకోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. 2017లో నార్సింగిలో నాలుగున్నరేళ్ల బాలికపై జరిగిన అత్యాచారం, హత్య కేసులో దోషికి కోర్టు మరణశిక్ష విధించింది. ఆ చిన్నారిపై సెంట్రింగ్ కార్మికుడు దినేశ్ కుమార్ అనే వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. ఈ కేసులో 2021లో నిందితుడికి రంగారెడ్డి కోర్టు ఉరిశిక్ష విధించింది. దీంతో ఈ తీర్పుపై దినేష్ హైకోర్టులో సవాల్ చేశాడు. అతడి పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. కింది కోర్టు తీర్పును సమర్ధించింది. దినేష్​ కుమార్​ కు ఉరిశిక్ష విధించడం సబబేనని ఈ రోజు ( 2024, జులై 31)హైకోర్టు కూడా అభిప్రాయపడింది.  


వివరాల్లోకి వెళితే.. 
2017వ సంవత్సరంలో నాలుగున్నరేళ్ల చిన్నారిని చాక్లెట్‌ ఆశ చూపి ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లి దినేష్ కుమార్ ధార్నే అనే  దారుణానికి ఒడిగట్టాడు. అత్యాచారానికి పాల్పడి దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో దినేష్‌ కుమార్‌ ధార్నే(25)కు ఉరిశిక్ష విధిస్తూ రంగారెడ్డి కోర్టు 2021లో  తీర్పు ఇచ్చింది. నార్సింగి పోలీస్‌ స్టేషన్​  పరిధిలో 2017లో ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలన రేపింది. బాలికపై పాశవికంగా ప్రవర్తించిన నిందితుడికి కఠిన శిక్ష పడాలన్న లక్ష్యంతో పోలీస్‌ అధికారులు తక్కువ సమయంలో సాక్ష్యాధారాలు సేకరించి కోర్టులో  సమర్పించారు. అసాధారణ ఘటనగా పరిగణించిన కోర్టు వేగంగా విచారణ పూర్తిచేసి నేరస్థుడైన దినేష్‌కు మరణ శిక్షవిధిస్తూ తీర్పు చెప్పింది. 


చాక్లెట్ ఇస్తానని చెప్పి.. 
అల్కాపురి టౌన్‌షిప్‌లోని ఆర్యమిత్ర కార్మిక శిబిరంలో ఒడిశాకు చెందిన భార్యభర్తలు పనిచేసేవారు. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌ జిల్లాకు చెందిన దినేష్‌ అక్కడే సెంట్రింగ్‌ పనిచేసేవాడు. ఒడిశా దంపతులతో చనువుగా ఉండేవాడు. 2017.. డిసెంబరు 12న ఇంటి ముందు ఒంటరిగా ఆడుకుంటున్న వారి కుమార్తె(5)కు చాక్లెట్ల ఆశ చూపి అపహరించుకుపోయాడు. కార్మిక శిబిరానికి సమీపంలోని నిర్జన ప్రదేశంలోని  పూల పొదల వద్దకు తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. పాపకు మెలుకువ వస్తే జరిగిన విషయాన్ని ఎవరికైనా చెబుతుందనే భయంతో బండరాయితో మోది హత్య చేశాడు. పాప కన్పించడం లేదని తల్లిదండ్రులు, ఇరుగు పొరుగు వారు పరిసర ప్రాంతాల్లో వెదుకుతుండగా నిందితుడు అమాయకత్వం నటిస్తూ వారిని అనుసరించాడు.


అమాయకుడిగా నటిస్తూ అంతం చేశాడు
అల్కాపురి టౌన్‌షిప్‌లోని ఆర్యమిత్ర లేబర్ క్యాంపులో ఒడిశాకు చెందిన భార్యభర్తలు పనిచేస్తుండేవారు. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాకు చెందిన దినేష్  కుమార్ అక్కడ సెంట్రింగ్  పనిచేస్తుండేవాడు. అతను ఒడిశాకు చెందిన దంపతులతో చనువుగా ఉండేవాడు. 2017 డిసెంబర్ 12న ఇంటి ముందు ఒంటరిగా ఆడుకుంటున్న వారి నాలుగున్నరేళ్ల చిన్నారికి చాక్లెట్లు ఇప్పిస్తానని చెప్పి ఎత్తుకెళ్లిపోయాడు. లేబర్ క్యాంపు సమీపంలోని నిర్జన ప్రాంతంలోని పూలపొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. మెలకువ వస్తే తన తండ్రికి విషయం చెబుతుందనే భయంతో  బండరాయితో కొట్టి హతమార్చాడు.  తల్లిదండ్రులు ఇరుగుపొరుగు వారు పరిసర ప్రాంతాల్లో వెతుకుతుండగా  అమాయకుడిగా నటిస్తూ వాళ్లనే ఫాలో అయ్యాడు. 


నిందితుడిని పట్టించిన గునుగు పూలు 
ఆ చిన్నారి చివరి సారిగా కలిసింది దినేష్‌నే అనే సమాచారంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు వేసుకున్న బట్టలకు అంటుకున్న గునుగు పూలను గమనించి అతడే నేరం చేశాడని నిర్ధారణకు వచ్చారు.  పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. అతడిపై కిడ్నాప్​, అత్యాచారం, హత్యతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నేరస్థుడికి ఉరి శిక్ష విధించాలని అప్పటి పబ్లిక్​ ప్రాసిక్యూటర్​ రాజిరెడ్డి  వాదించారు.  సాక్ష్యాధారాలు పరిశీలించిన కోర్టు .. నిందితుడు దినేష్‌కు ఉరిశిక్ష, రూ.1,000 జరిమానా విధిస్తూ తుది తీర్పు ఇచ్చారు. దినేష్​ కుమార్​ హైకోర్టుకు అప్పీలు చేయగా..  తెలంగాణ హైకోర్టు కింద కోర్టు తీర్పును సమర్థించింది.