Son Killed Parents in Vijayanagaram: విజయనగరం (Vijayanagaram) జిల్లాలో శుక్రవారం దారుణం జరిగింది. బొండపల్లి (Bondapally) ఎస్సీ కాలనీలో ఓ వ్యక్తి నీటి కుళాయి విషయంలో తల్లిదండ్రులపైనే కత్తితో దాడి చేసి హతమార్చాడు. డోల రాము (55), జయలక్ష్మి (40) దంపతుల కుమారుడు లక్ష్మణ్ శుక్రవారం ఇంటి ఎదుట ఉన్న కుళాయి విషయంలో వారితో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో ఆవేశానికి లోనైన లక్ష్మణ్ తల్లిదండ్రులను కత్తితో పొడిచేశాడు. అడ్డు వచ్చిన స్థానికులను సైతం బెదిరించడంతో వారు ఆందోళనకు గురై మిన్నకుండిపోయారు. కాగా, రాము తొలి భార్య ఇంటి నుంచి వెళ్లిపోవడంతో జయలక్ష్మిని రెండో వివాహం చేసుకున్నాడు. దీంతో కుమారుడు లక్ష్మణరావు వేరే ఇంటిలో ఉంటున్నాడు. హత్య సమాచారం అందుకున్న గజపతినగరం సీఐ ప్రభాకర్, ఎస్సైలు లక్ష్మణరావు, మహేష్ లు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Also Read: Dharmana Prasadarao: వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనాలని పిలుపు - మంత్రి ధర్మానపై ఈసీకి ఫిర్యాదు