Woman Torutured In Kurnool District: ఓ యువకుడు వేరే వర్గానికి చెందిన అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకుని వెళ్లిపోవడం అతని తల్లిని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. యువతి బంధువులు దళిత మహిళ అయిన ఆమెను స్తంభానికి కట్టేసి చిత్రహింసలకు గురి చేశారు. ఈ దారుణ ఘటన కర్నూలు జిల్లాలో (Kurnool District) చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దకడుబూరు మండలం కల్లుకుంటలో దళితుడైన ఈరన్న అనే యువకుడు.. మరో వర్గానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. వీరి ప్రేమకు కులం అడ్డంకిగా మారడంతో ఇద్దరూ పెళ్లి చేసుకుని ఊరి నుంచి వెళ్లిపోయారు. ఇలా జరిగిన వెంటనే యువకుని కుటుంబం ఊరు విడిచి వెళ్లిపోయారు. 6 నెలల తర్వాత తిరిగి గ్రామానికి వచ్చింది. ఈ క్రమంలో యువతి బంధువులు తీవ్ర ఆగ్రహంతో యువకుడి తల్లి గోవిందమ్మను గురువారం రాత్రి కరెంట్ స్తంభానికి కట్టేసి కొట్టారు. దీంతో స్థానికులు ఆమెను విడిపించేందుకు యత్నించగా వారు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.


రక్షించిన పోలీసులు


సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టి స్తంభానికి కట్టేసిన మహిళను విడిపించారు. ఆరు నెలల క్రితం దళితుడైన ఈరన్న.. మరో సామాజిక వర్గానికి చెందిన యువతిని పెళ్లి చేసుకోవడమే అని పేర్కొన్నారు. అబ్బాయి తల్లిదండ్రులు గ్రామంలో ఉండకూడదని మరో సామాజికవర్గం ఆదేశించడంతో గొడవ మొదలైనట్లుగా తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Also Read: YSRCP Leaders Bail: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు