Mumbai Crime News: 



మహిళపై అత్యాచారం..


ఆన్‌లైన్‌లో పరిచయమైన మహిళను పలుసార్లు అత్యాచారం చేశాడు ముంబయికి చెందిన ఓ వ్యక్తి. మెక్సికోకి చెందిన 31 ఏళ్ల మహిళ డీజేగా పని చేస్తోంది. ఓ వ్యక్తి తనను అత్యాచారం చేశాడంటూ బంద్రా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ కేసుపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టిన పోలీసులు...నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు కూడా డీజేగానే పని చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. 2017లోనే వీళ్లిద్దరికీ ఆన్‌లైన్‌లో పరిచయమైంది. 2019 నుంచి చాలా సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని కంప్లెయింట్ చేసింది. ఆమె మేనేజరే నిందితుడుని పోలీసులు వెల్లడించారు. 


"బాధితురాలికి నిందితుడికి 2017లోనే సోషల్ మీడియాలో పరిచయమైంది. ప్రస్తుతం బాధితురాలు బంద్రాలోనే ఉంటోంది. 2019లో జులైలో మొదటి సారి ఆమె ఇంటికి వెళ్లి లైంగికంగా వేధించాడని ఫిర్యాదు చేసింది. ఆ తరవాత చాలా సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపింది. ఈ సంగతి ఎవరికైనా చెబితే ఉద్యోగంలో నుంచి తీసేస్తాని బెదిరించాడు. వీడియోలు, ఫొటోలు బయట పెడతానని బెదిరించాడు. ఆ తరవాతే బాధితురాలు మాకు ఫిర్యాదు చేసింది"


- పోలీసులు


నిందితుడు తనకు అసభ్యకరమైన ఫొటోలు పంపేవాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. 2020లోనే నిందితుడికి పెళ్లైనప్పటికీ పదేపదే తన లైంగిక వాంఛ తీర్చాలంటూ బెదిరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.