మేడ్చల్ జిల్లా : సూరారం పీఎస్ పరిధిలో నాలుగు రోజుల కనిపించకుండా పోయిన చిన్నారి కేసు విషాదాంతమైంది. గోనె సంచిలో బాలిక మృతదేహం కనిపించింది. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బాసరగడి గ్రామంలో గోనె సంచిలో బాలిక మృతదేహం లభించింది. చిన్నారులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలని, అపరిచితులకు దూరంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. 


అసలేం జరిగిందంటే..
పోలీసుల కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రభాకర్ హైదరాబాద్ వచ్చి కుటుంబంతో పాటు సూరారం కాలనీలో నివాసం ఉంటున్నాడు. కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వారికి ఇద్దరు కుమార్తెలు కాగా, జోత్స్న పెద్ద కుమార్తె, వయసు ఏడు సంవత్సరాలు. ఈ క్రమంలో ఈ నెల 12న కుమార్తె ఏం.జోష్న(7) కనిపించడం లేదని సూరారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  ఏడు నెలల క్రితం  సురారంలో నివాసముంటున్నారు.


నేడు మేడ్చల్ శివారు ప్రాంత మైన బాసర గడి గ్రామంలో గోనె సంచిలో ఆదృశ్య మైన బాలిక మృతదేహాన్ని సూరారం పోలీసులు గుర్తించారు. ఈ విషయంపై పోలీసుల నుంచి సమాచారం అందుకున్న బాలిక తండ్రి ప్రభాకర్, తల్లి సుమ కన్నీరు మున్నీరవుతున్నారు. వారి పక్క ఊరైన తిరుపతి వీరి ఇంటికి వచ్చే క్రమంలో సుమతో పరిచయం ఏర్పడింది. ఆమెను కలిసేందుకు వస్తున్న క్రమంలో పాప అడ్డు వస్తుందనే హత్య చేసి ఉంటాడని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు కేసు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.


Also Read: IAS IPS : ఐఏఎస్‌లు డీవోపీటీ ఆదేశాల పాటించాల్సిందే - క్యాట్ ఆర్డర్స్ - ఏపీలో రిపోర్టు చేయనున్న అమ్రపాలి !