కట్టుకున్న భర్త భార్యను ఉరేసి చంపిన ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. ఆమె ఎవరితోనో వివాహేతర సంబంధం పెట్టుకొని తన పరువు తీసిందని ఆరోపిస్తూ భర్త తన భార్యను హత్య చేశాడు. భార్య తల్లిదండ్రులు మెదక్‌ జిల్లాలోని శంకరంపేట పోలీస్‌ స్టేషన్‌లో ఆమె కనిపించడం లేదని ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. విచారణ జరిపిన పోలీసులు అసలు విషయాలను వెల్లడించారు.


మెదక్‌ జిల్లాలోని శౌకత్‌ పల్లి గ్రామానికి చెందిన మాడావత్‌ శంకర్‌ అనే వ్యక్తి మునుగోడు మండలం కొరటికల్‌ సమీపంలో రోడ్డు పనిలో కూలీగా పని చేస్తున్నాడు. ఇతను మెదక్‌ జిల్లా ఎస్‌ కొండాపురం గ్రామానికి చెందిన సరిత అలియాస్‌ శిరీష అనే 21 ఏళ్ల యువతి ప్రేమించుకుంటున్నారు. రెండు కుటుంబాల్లోనూ ఒప్పించి నాలుగు నెలల క్రితమే పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు రెండు నెలలపా సఖ్యతతోనే కలిసి ఉన్నారు. అనంతరం, ఉగాది పండుగకు ఏప్రిల్‌ 1న పుట్టింటికి వెళ్లిన సరిత అదే గ్రామానికి చెందిన గుగులోతు సురేష్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతని వెళ్లిపోయిందనే ఆరోపిస్తూ భర్త ఆమెను హత్య చేశాడు.


దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఏప్రిల్‌ 18న సరిత, సురేష్‌ను గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇరువర్గాల పెద్దల పంచాయతీ మధ్య ఇద్దరికీ కౌన్సెలింగ్‌ చేశారు. అప్పుడు తలూపిన ఆమె తర్వాత సురేష్‌తోనే మళ్లీ వెళ్లి పోయింది. కొన్నిరోజుల తర్వాత సరిత తన ప్రియుడు సురేష్‌ ఫోన్‌ నుంచి భర్త శంకర్‌కు కాల్‌ చేసి ‘నీతో పాటు వస్తాను నన్ను తీసుకెళ్లిపో’ అని కొరింది. ఆ తర్వాత తన తల్లిగారింటికి చేరుకున్న సరిత ఈ నెల 10న మరోసారి తండ్రి పూలా సింగ్‌ ఫోన్‌ నుంచి భర్త శంకర్‌కు కాల్‌ చేసి తనను తీసుకెళ్లమని కోరడంతో సరే అన్నాడు. పూలా సింగ్‌ తన పెద్ద అల్లుడు ముడావత్‌ బాబుకు విషయం చెప్పగా.. అతడు హైదరాబాద్‌లో శంకర్‌కు సరిత అప్పగించి వెళ్లిపోయాడు. ఇక అంతా ముగిసిందని కుటుంబ సభ్యులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.


పరువు తీసిందనే కోపంతో హత్య
యువతి తనను మోసం చేసి మరొకరితో లేచిపోయిందని, తద్వారా తన పరువు మొత్తం పోయిందని మనసులో పెట్టుకున్న మాడావత్‌ శంకర్‌.. ఎలాగైనా సరితను హత్య చేయాలని భావించాడు. ఈ నెల 13న తనతో పాటు సరితను నల్గొండకు తీసుకొచ్చి ఇద్దరూ ఓ లాడ్జిలో దిగారు. కోపంతో రగిలిపోతున్న శంకర్‌ భార్య సరిత మెడకు చున్నీతో చుట్టి అదే గదిలో ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. సరిత చనిపోయిందని నిర్దారించుకున్న తర్వాతే శంకర్‌ లాడ్జి నుంచి బస్టాండ్‌కు వచ్చి తిరిగి హైదరాబాద్‌ వెళ్లిపోయాడు. శంకర్‌ మళ్లీ సోమవారం నల్గొండకు వచ్చి మునుగోడు బస్సు ఎక్కే ప్రయత్నం చేస్తుండగా, పోలీసులు పట్టుకుని అరెస్ట్‌ చేశారు.