Mancherial News : మంచిర్యాల జిల్లాలో దళిత బంధు పేరుతో ఓ వివాహితను లోబర్చుకునేందుకు యత్నించాడు ఎంపీపీ భర్త. భార్య భర్తల మధ్య గొడవలో తలదూర్చి వివాహితను తన వశం చేసుకోవాలని ప్రయత్నించాడు హజిపూర్ ఎంపీపీ భర్త మందపల్లి శ్రీనివాస్. తన భర్త రామగిరి సురేష్ కు దళిత బంధు ఇచ్చేందుకు మందపల్లి శ్రీనివాస్ వేధింపులకు గురిచేస్తున్నాడని వివాహిత పోలీసులను ఆశ్రయించింది.  



అసలేం జరిగింది? 


దళిత బంధు పేరుతో అధికార పార్టీకి చెందిన ఓ నేత వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ ఆ వివాహిత మంచిర్యాల పోలీసులను ఆశ్రయించింది. మంచిర్యాల జిల్లా ఊరు శ్రీరాంపూర్ కు చెందిన వివాహిత భర్త చనిపోవడంతో ఒంటరిగా జీవిస్తుంది. ఇదే క్రమంలో హాజీపూర్ మండలం రాపల్లి గ్రామానికి చెందిన రామగిరి సురేష్ కు పరిచయం ఏర్పడడంతో రెండో పెళ్లి చేసుకున్నారు. కుటుంబ కలహాలతో పోలీసులను ఆశ్రయించడంతో  పెద్ద మనుషుల ఒప్పందంతో విడివిడిగా ఉంటున్నారు. ఈ ఒప్పందంలోనే వివాహితను హాజీపూర్ మండల ఎంపీపీ భర్త మందపల్లి శ్రీనివాస్ తన భర్త ద్వారా వేధింపులకు గురి చేస్తున్నాడని వివాహిత ఆరోపించింది. దీంతో శుక్రవారం మంచిర్యాల పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన రెండో భర్త రామడుగు సురేష్ తనను ఎంపీపీ భర్త మందపల్లి శ్రీనివాస్ తో ఉండాలంటూ రోజు ఇంటికి వచ్చి బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించింది. లేకపోతే తనకు దళిత బంధు రాకుండా చేస్తాడని అంటున్నాడని తెలిపింది. ఎంపీపీ భర్త శ్రీనివాస్ తో ఉండకపోతే తనను, తన కొడుకును చంపేస్తానని బెదిరిస్తున్నాడని బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొంది.


టీవీ యాంకర్ కు వేధింపులు 

 

 ప్రస్తుత కాలంలో మానవ సంబంధాలకు విలువ తగ్గిపోతుంది. ముఖ్యంగా అమ్మాయిలు, మహిళలపై వేధింపులు మరింత పెరిగిపోయాయి. కనిపించిన అమ్మాయి వెంటపడడం, కోరిక తీర్చమనడం లేదంటే బెదిరింపులకు పాల్పడడం షరా మామూలు అయింది. అయితే ఇలాంటి బెదిరింపులే ఓ టీవీ యాంకర్ కు ఎదురయ్యాయి. తన కోరిక తీర్చాలని లేకపోతే మార్ఫింగ్ చేసిన అమ్మాయి నగ్న ఫొటోలను సామాజిక మాద్యమాల్లో పెడతానంటూ ఓ యువకుడు వేధింపులకు గురి చేశాడు. గతంలో కూడా ఓసారి ఇదే అబ్బాయి సదరు యాంకర్ పై అత్యాచారయత్నం చేశాడు. గతంలో భయంతో యువతి ఏమీ చేయలేకపోయినా ఈసారి ధైర్యంగా పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.   హైదరాబాద్ లోని మధురానగర్ లోని ఓ హాస్టల్ లో ఉంటున్న 27 ఏళ్ల యువతి యాంకర్ గా పని చేస్తోంది. అయితే కూకట్ పల్లికి చెందిన 30 ఏళ్ల సామ్రాట్ తో స్నేహం ఉంది. గతంలో కళాశాలలో చదివే రోజుల్లో వీరిద్దరూ సహ విద్యార్థులు. మొదటి నుంచి సామ్రాట్ తనను ప్రేమిస్తున్నానని చెబుతున్నాడు. అమె మాత్రం అందుకు నిరాకరించింది. ఈ క్రమంలోనే స్నేహితుల్లా కలిసుందామని చెప్పడంతో యువతి ఓకే చెప్పింది. ఇలాగే మాయమాటలు చెప్పిన సామ్రాట్ గతంలో ఓసారి కారులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అత్యాచారం చేయబోయాడు. ఎలాగోలా యువతి అతడి బారి నుంచి తప్పించుకుంది. అప్పటి నుంచి సామ్రాట్ సదరు యాంకర్ పై పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే తరచూ వేధింపులకు గురి చేస్తున్నాడు. ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి నగ్న చిత్రాలుగా మార్చాడు. తన కోరిక తీర్చకపోతే వాటిని సామాజిక మాధ్యమాల్లో పెట్టి పరువు తీస్తానని బెరిదిస్తున్నాడు. ఇవన్నీ భరించలేని యువతి ధైర్యం చేసి ఎస్సార్ నగర్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.