Land Dispute Kills 3 People: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భూ తగాదాల కారణంగా రెండు వర్గాల వారు పరస్పరం కత్తులు, గొడ్డళ్లతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో మహిళ సహా ముగ్గురు మృతిచెందారు. మరో ఇద్దరు, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.


కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం జక్కులపల్లి గ్రామంలో రెండు కుటుంబాలకు భూ తగాదాలున్నాయి. ఈ క్రమంలో భూమి విషయంలో మరోసారి గొడవ జరిగింది. కానీ గతంలో లాగ మాటమాటతో సరిపోలేదు. ఏకంగా గొడ్డళ్లు, కత్తులతో ఇరు వర్గీయులు దాడులు చేసుకోవడంతో దారుణం జరిగింది. మహిళ సహా ముగ్గురు చనిపోయారు. మరో ముగ్గురు గాయపడగా, వారికి చికిత్స నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడుల్లో గ్రామానికి చెందిన లింగయ్య, బతుక్కమ్మ, నర్సయ్య అనే ముగ్గురు మృతిచెందినట్లు పోలీసులు వెల్లడించారు. గొడవ విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దాడిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial