Abdullapur Met wife death: హైదరాబాద్ శివారులో ఉన్న అబ్దుల్లాపూర్‌ మెట్‌ పరిధిలో (Abdullapur Met News) కిరాతకం జరిగింది. స్థానిక జవహార్ లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ (జేఎన్ఎన్‌యూఆర్ఎం) కాలనీలో నివాసం ఉండే ఓ వ్యక్తి తన భార్యను అతి దారుణంగా హత్య చేశాడు. నిందితుడిని పోలీసులు వినయ్‌ అని గుర్తించారు. అతను తన భార్యనే అతి కిరాతకంగా తల నరికి హత్య చేశాడని.. పోలీసులు, స్థానికులు తెలిపారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వినయ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఈ హత్యను వినయ్ ఎందుకు చేశాడనే కారణాల తాము విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. స్థానికులు మాత్రం కుటుంబ కలహాలు, వివాహేతర సంబంధం అని చెబుతున్నారు.


చర్లపల్లిలో బాలుడు అనుమానాస్పద మృతి


మేడ్చల్ జిల్లా చర్లపల్లిలో అద్దెకు ఉంటున్న బిహార్ నుంచి 5 నెలల క్రితం బతుకు దెరువు కోసం వచ్చిన ప్రదీప్ రునా కుమారుడు ప్రిన్స్ (8) చర్లపల్లి ప్రభుత్వ పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్నాడు. నిన్న సోమవారం మద్యాహ్నం నుంచి కనిపించకపోవడంతో అతని కుటుంబసభ్యులు చర్లపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ రోజు సాయంత్రం చర్లపల్లి నుంచి రైల్వే స్టేషన్ కు వెళుతుండగా కనకదుర్గ వైన్స్ ఎదురుగా చెట్ల మధ్యన ప్రిన్స్ మృతదేహాన్ని మంగళవారం సాయంత్రం పోలీసులు కనుగొన్నారు. గాలి పటం కోసం వెళ్లి గోడపై నుంచి కింద పడి మృతి చెంది ఉండొచ్చు అని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ హాస్పటల్ కి తరలించారు.