పని చేసే ప్రదేశాల్లో సహోద్యోగుల మధ్య మనస్పర్థలు రావడం సహజమే. తోటి వారికి బాస్ నుంచి ప్రశంసలు దక్కితే కొంత మంది భరించలేరు. వారిని ఎలాగైనా తొక్కాలని చూస్తుంటారు. ఇంకొంత మంది కక్ష పెంచుకుంటూ అలాగే ఉండిపోతారు. కానీ, ఉత్తర్ ప్రదేశ్‌లో మాత్రం ఓ సహోద్యోగి దారుణానికి ఒడిగట్టాడు. ఏకంగా సీనియర్‌ సహ ఉద్యోగి ప్రమోద్‌ కుమార్‌ అనే వ్యక్తిపై కక్ష పెంచుకున్న సందీప్‌ మిశ్రా అనే వ్యక్తి అతని అంతానికి పథకం పన్నాడు. ఆ ఘటనకు ఆయన పాల్పడ్డ తీరు అత్యంత దారుణంగా ఉంది. ఈ ఘటన యూపీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది.


ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగిన ఘటన ఇది. ఓ పథకం ప్రకారం సహ ఉద్యోగికి పూటుగా మద్యం తాగించి మరో వ్యక్తి అతణ్ని అంతమొందించాడు. పోలీసుల కథనం మేరకు.. ఓ ఆటోమొబైల్‌ అనుబంధ కంపెనీలో మెషిన్‌ ఆపరేటర్‌గా పనిచేసే సందీప్‌ ఉన్నతాధికారులకు తనపై ఫిర్యాదు చేశాడని సీనియర్‌ సహోద్యోగి అయిన ప్రమోద్‌పై విపరీతంగా కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా అతనిపై పట్టరాని కోపంతో రగిలిపోయాడు. ఈ మేరకు ఓ ప్రణాళిక వేశాడు. 


గత ఆదివారం రాత్రి మందు పార్టీ ఉంది రమ్మని ప్రమోద్‌ను ఇంటికి పిలిచి ఫూటుగా తాగించాడు. అతను పూర్తి మత్తులో ఉన్నపుడు కత్తితో అమాంతం తలను తెగ నరికాడు. అనంతరం, ఆ రాత్రి మొత్తం మొండెం పక్కనే నిద్రించిన నిందితుడు మరుసటిరోజు ఉదయాన్నే ప్రమోద్‌ తలను ప్లాస్టిక్‌ సంచిలో చుట్టేసి, ఓ చెత్త కుప్పలో విసిరేశాడు. అక్కడకి 300 కిలో మీటర్ల దూరంలోని కాస్‌గంజ్‌ అనే ప్రాంతంలో ఉంటున్న ప్రమోద్‌ కుమార్‌ భార్య ఎంతసేపు ప్రయత్నించినా భర్త స్పందించకపోవడంతో ఆమె ఘజియాబాద్ చేరుకుంది. భర్తను వెదుక్కొంటూ ఆమె సందీప్‌ ఇంటికి రావడంతో విషయం బహిర్గతమైందని పోలీసులు వెల్లడించారు.


Also Read: కోర్టు సంచలన తీర్పు.. విద్యార్థి దారుణహత్య కేసులో 20 మందికి మరణశిక్ష..!


Also Read: ట్యాంకులో కుళ్లిన శవం ఇతనిదే.. ముట్టుకుంటే ఊడిపోయేలా డెడ్‌బాడీ, హత్యా.. ఆత్మహత్యా?


Also Read: కోట్లకు కోట్లు ఇచ్చిన వాళ్లు కిక్కురుమనడం లేదా ? శిల్పాచౌదరి కేసులో ఏం జరుగుతోంది ?


Also Read: వివాహేతర సంబంధం.. భర్తతో కలిసి ప్రియుడిని హతమార్చిన మహిళ.. ట్విస్ట్ ఏంటంటే..!


Also Read: Honour Killing: సొంత అక్క తల నరికిన తమ్ముడు.. అందుకు కన్నతల్లి సాయం, తల వేరు చేసి తల్లీకొడుకుల సెల్ఫీలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి