సికింద్రాబాద్: భర్త వీర్యానికి బదులు వేరే వ్యక్తి వీర్యంతో ఐవీఎఫ్ చేసిన సికింద్రాబాద్ రెజిమెంటల్బజార్లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రం నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత, ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అద్దె గర్భాల కోసం అక్రమంగా వీర్యాన్ని, అండాలను సేకరిస్తున్నట్టు దర్యాప్తులో తేల్చారు. ఐవీఎఫ్ ద్వారా పుట్టిన బిడ్డకు డీఎన్ఏ పరీక్షలు చేయించడంతో తమ బిడ్డ కాదని తేలగా రాజస్థాన్కు చెందిన భార్యాభర్తలు శనివారం పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
ఇండియన్ స్పెర్టెక్ సంస్థ రీజినల్ మేనేజర్ అరెస్ట్..దంపతుల ఫిర్యాదు మేరకు ఐవీఎఫ్ సెంటర్పై కేసు నమోదు చేసిన పోలీసులు.. వైద్యాధికారులతో కలిసి శనివారం అర్ధరాత్రి 2 గంటల వరకు సిబ్బందిని ప్రశ్నించారు. వైద్యాధికారులు పలు కీలక డాక్యుమెంట్స్తోపాటు వీర్య కణాల శాంపిల్స్ తీసుకెళ్లారు. అద్దె గర్భాల కోసం అక్రమంగా వీర్యాన్ని, అండాలను సేకరిస్తున్నారని.. వీర్యకణాలు, అండాలను గుజరాత్, మధ్యప్రదేశ్ తరలిస్తున్నట్టు గుర్తించారు. అనుమతులు లేకుండానే రెజిమెంటల్ బజార్లో ఇండియన్ స్పెర్టెక్ సంస్థను నిర్వహిస్తున్నట్టు విచారణలో తేల్చారు. దీంతో ఆ సంస్థ రీజినల్ మేనేజర్ పంకజ్ సోనీని నిందితుడిగా చేర్చారు. పంకజ్తోపాటు సంపత్, శ్రీను, జితేందర్, శివ, మణికంఠ, బోరో అనే వ్యక్తులను అరెస్టు చేశారు.
రూ.30 లక్షలతో ఐవీఎఫ్పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్కు చెందిన దంపతులు నాలుగేళ్లుగా సికింద్రాబాద్లో ఉంటున్నారు. వివాహం జరిగి ఏడేళ్లు వుతున్నా సంతానం లేకపోవడంతో మూడేళ్ల క్రితం సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రాన్ని సంప్రదించారు. సరోగసీ ద్వారా పిల్లలకు అవకాశం ఉందని నిర్వాహకురాలైన డాక్టర్ నమ్రత వారికి తెలియజేశారు. ఈ ప్రక్రియ మొత్తానికి రూ.30 లక్షలు అవుతుందని చెప్పడంతో ఆ దంపతులు అంగీకరించారు. గతేడాది ఆగస్టులో మొత్తం డబ్బు కూడా చెల్లించారు.
డీఎన్ఏ టెస్ట్ చేయించడంతో విషయం వెలుగులోకి..అయితే ఈ ప్రక్రియపై పూర్తి నమ్మకం లేని సదరు దంపుతులు బిడ్డ జన్మించిన తర్వాత తమతో పాటు సరోగసీకి అంగీకరించిన మహిళ డీఎన్ఏ నమూనాలు సేకరించి.. పోల్చాలని షరతు విధించారు. ఈ ఏడాది బిడ్డ జన్మించింది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం డీఎన్ఏ పరీక్షలు చేయించాలని డాక్టర్ నమ్రతను కోరారు. అయితే ఆమె తరచూ వాయిదాలు వేస్తూ వస్తున్నారు. అనుమానం వచ్చిన దంపతులు బాలుడికి దిల్లీలో డీఎన్ఏ పరీక్షలు చేయించారు. కానీ తల్లిదండ్రుల డీఎన్ఏతో బిడ్డ డీఎన్ఏ సరిపోలేదు.
తప్పును అంగీకరించిన డాక్టర్ నమ్రతఈ జూన్ రెండోవారంలో డాక్టర్ నమ్రతను దంపతులు మళ్లీ సంప్రదించారు. బిడ్డ తమకు జన్మించలేదని.. బాలుడి తల్లిదండ్రులకు ఇవ్వాలని ఖరాఖండిగా చెప్పేశారు. దీంతో తప్పును అంగీకరించిన డాక్టర్.. సమస్యను పరిష్కరించేందుకు టైమ్ ఇవ్వాలని అడిగారు. కానీ తర్వాత నుంచి వారికి అందుబాటులో లేకుండా పోయారు. మోసపోయామని భావించి దంపతులు గోపాలపురం పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదైంది. శనివారం యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో తనిఖీలు చేసి నమ్రతతోపాటు మరికొందరిని అరెస్ట్ చేశారు.