Bapatla Crime : ఏపీలో మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు ఆగడంలేదు. తాజాగా ఓ గ్రామ వాలంటీర్ బాలికపై మూడు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలో బాలిక(15)పై గ్రామ వాలంటీర్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు ఉపాధి కోసం మరో గ్రామంలో ఉంటున్నారు. అమ్మమ్మతో కలిసి బాలిక ఈ గ్రామంలో ఉంటుంది. వాలంటీర్‌గా పనిచేస్తున్న వివాహితుడు రావిపాటి కోటయ్య బాలికను బెదిరిస్తూ గత మూడు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. చివరకు ఈ విషయాన్ని బాధిత బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత బాలికను చికిత్స కోసం ఒంగోలు రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు రావిపాటి కోటయ్య పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.  నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.  


బాలికపై వృద్ధుడి అత్యాచారం


చిత్తూరు జిల్లాలో రోజు రోజుకి అత్యాచార ఘటనలు పెరుగుతూ ఉన్నాయి. ఒంటరిగా మహిళ కనిపిస్తే చాలు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. పసికందుల వద్ద నుండి పండు ముసళ్ళు వరకూ వావివరుస అనే తేడా లేకుండా మృగాళ్లు తమ కామావాంఛ తీర్చుకుంటున్నారు. మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు తీసుకొచ్చి, కఠిన శిక్షలు అమలు చేస్తున్నా, కామాంధుల వెన్నులో మాత్రం వణుకు పుట్టడం‌ లేదు. ఏదో ఒక మూల ఏదో విధంగా మృగాళ్లు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ఓ వృద్దుడు 9 సంవత్సరాల బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్ళితే చిత్తూరు జిల్లా కేంద్రంలోని సీబీ రోడ్డులో నివాసం ఉండే ధనపాల్ అనే 58 ఏళ్ల వ్యక్తి నివాసం ఉంటున్నాడు. రోజువారి కూలీ‌ పనులు చేసుకుంటూ ధనపాల్ జీవనం సాగించేవాడు. కూలీ పనులు పూర్తి అయ్యాక మద్యం సేవించి ఇంటికి చేరుకన్న ధనపాల్ కుటుంబ సభ్యులతో తరచూ గొడవకు దిగేవాడు. దీంతో కుటుంబ సభ్యులు ధనపాల్ ను పెద్దగా పట్టించుకునే వారు కాదు. అయితే కుటుంబానికి దూరంగా ఉండడంతో తన ఇంటికి సమీపంలో ఉండే తొమ్మిదేళ్ళ బాలికపై ధనపాల్ కన్నేశాడు. ఈ క్రమంలో యథావిధిగా గత రెండు రోజుల క్రితం కూలీ పనులకు వెళ్ళిన ధన్ పాల్ అర్థాంతరంగా కూలీ ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులతో గొడవ పడ్డాడు. 


మద్యం సేవించి


అటు తరువాత ఫూటుగా మద్యం సేవించి ధనపాల్ ఇంటికి వెళ్ళే సమయంలో తొమ్మిదేళ్ళ బాలిక కనిపించింది. బాలికతో మాటమాట కలిసి తినుబండాలు కొని  ఇస్తాను అని చెప్పి మాయమాటలు చెప్పాడు. తాగిన మైకంలో మనవరాలి వయస్సులో ఉన్న బాలికను ఇంటికి సమీపంలో ఉన్న పొదల మాటుకు తీసుకెళ్ళి తాకరాని చోటు ముట్టుకుని అభం శుభం తెలియని బాలికపై పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడేందుకు ప్రయత్నించాడు. ధనపాల్ వికృత చేష్టలను భరించలేని బాలిక గెట్టిగా కేకలు వేస్తూ వృద్దుడి‌ నుండి తప్పించుకుని పొదల నుండి ఇంటికి‌ పరుగులు తీసింది. బాలిక కేకలు విన్న స్ధానికులు ఘటన స్ధలంకు చేరుకుని ధనపాల్ దేహశుద్ది చేసి చిత్తూరు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఘటన స్ధలానికి చేరుకున్న పోలీసులు ధనపాల్ ను అదుపులోకి తీసుకుని ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.