కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు వ్యక్తులు మనిషి, పశువు అన్న బేధం లేకుండా ప్రవర్తిస్తున్నారు. తమ వాంఛ తీర్చుకునేందుకు మూగ జీవాలను కూడా వదలడం లేదు. గతంలో పశువులపై ఇలాంటి ఘటనలు వెలుగు చూశాయి. ఆఖరికి కుక్కపైన కూడా అత్యాచారం జరిగిన ఘటన హైదరాబాద్‌లోనే కొద్ది నెలల క్రితం వెలుగు చూసింది. కానీ, తాజాగా ఓ వ్యక్తి మాత్రం ఆవుపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆవు ప్రాణాలు కోల్పోయింది. ఈ అమానవీయ దారుణ ఘటన నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో చోటు చేసుకుంది.


నిర్మల్‌ జిల్లా లోకేశ్వరం మండలంలోని పిప్రి గ్రామంలో హిందువులు పవిత్రంగా భావించే ఆవుపైనే అఘాయిత్యానికి పాల్పడ్డ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఆవు అక్కడిక్కడే మరణించింది. ఆవుకు కట్టిన తాడు దాని గొంతుకు బిగుసుకొని ఉరి పడింది. పోలీసులు ఈ ఘటనకు సంబంధించి వివరాలు వెల్లడించారు. 


నిర్మల్ జిల్లా పిప్రి గ్రామానికి చెందిన రావుల సాయన్న అనే రైతు కొత్త ఇల్లు కట్టించుకుంటున్నాడు. ఇంట్లో మార్బుల్స్ వేయిస్తున్నాడు. అందుకోసం ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన మార్పుల్స్ వేసే కూలీలను పిలిపించాడు. వీరిలో విజయ్‌ అనే యూపీకి చెందిన వ్యక్తి కూడా ఉన్నాడు. మార్బుల్స్ పనిలో భాగంగా వారు పని అయ్యే వరకూ అక్కడే రాత్రి వేళ పడుకుంటున్నారు. ఈ క్రమంలో బుధవారం అందరూ నిద్రించిన అనంతరం అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 


యజమాని సాయన్నకు చెందిన ఆవు కొట్టంలో కట్టేసి ఉంది. దాన్ని తాడుతో పాటు కొత్త ఇంట్లోకి తీసుకొచ్చి కిటికీ ఊచలకు తాడుతో కట్టాడు. అనంతరం అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ క్రమంలో ఆవు ఎంతోసేపు అటు ఇటూ పెనుగులాడింది. కింద మార్బుల్స్ వేసి ఉండడంతో కాలు జారి కింద పడింది. దీంతో కిటికీకి కట్టిన తాడు ఆవు మెడకు బిగుసుకొని ఉరి ఏర్పడింది. ఆ విషయం గమనించని నిందితుడు తన పని కానిచ్చాడు. ఉరి గట్టిగా బిగుసుకోవడంతో ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. 


ఉదయం కొట్టంలో కట్టేసిన ఆవు కనిపించక పోవడంతో వెతికిన రైతుకు కొత్త ఇంట్లో ఆవు చనిపోయి కనిపించింది. అంతేకాక, రోజు కూలీ విజయ్‌ తీవ్రమైన అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారించగా సదరు కూలీ తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పశువుల వైద్యులు ఆవుకు పోస్టుమార్టం నిర్వహించి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు.