Man Abused Five Months Old Baby In Vijayanagaram: నంద్యాల జిల్లాలో 8 ఏళ్ల చిన్నారిపై అత్యాచార ఘటన మరువక ముందే విజయనగరం (Vijayanagaram) జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. రామభద్రాపురం మండలం జీలుగువలసలో శనివారం 5 నెలల పసికందుపై వరుసకు తాత అయిన వ్యక్తి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నారిని తల్లి ఊయలలో వేసి గ్రామంలోని కిరాణా దుకాణానికి వెళ్లింది. నార్లవలస గ్రామానికి చెందిన బోయిన ఎరకన్న దొర అనే వ్యక్తి ఇంట్లో ఎవరూ లేరని గుర్తించి ఊయలలో ఉన్న చిన్నారిపై అత్యాచారం చేశాడు. దీంతో పాప గట్టిగా ఏడవగా చిన్నారి అక్క అక్కడికి చేరుకుని వెంటనే తల్లికి సమాచారం అందించింది. 


దారుణాన్ని గుర్తించిన తల్లితో పాటు గ్రామస్థులు నిందితుడిని పట్టుకునేందుకు యత్నించగా అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం చిన్నారిని బాడంగి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ పాపకు ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం విజయనగరంలోని ఘోష ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారికి చికిత్స అందిస్తున్నారు. డీఎస్పీ శ్రీనివాసరావు గ్రామానికి వెళ్లి విచారణ చేశారు. చిన్నారి కుటుంబం, స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నార్లవలస వెళ్లి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.


కాగా, నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం మచ్చుమర్రి గ్రామంలో 4 రోజుల క్రితం ముగ్గురు మైనర్లు 8 ఏళ్ల బాలికపై అత్యాచారం చేయడంతో మృతి చెందింది. అనంతరం మృతదేహాన్ని నదిలో పడేసినట్లు నిందితులు పోలీసుల ఎదుట ఒప్పుకొన్నారు. వారు చెప్పిన సమాచారంతో నదిలో వెతకగా ఇప్పటివరకూ బాలిక మృతదేహం లభ్యం కాలేదు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు ఇంకా గాలింపు కొనసాగిస్తున్నారు.


Also Read: Nandyal News: రైలు నుంచి కిందపడిన భార్య - కాపాడబోయి భర్త మృతి, నంద్యాల జిల్లాలో ఘటన