ప్రేమ దేశంలో హీరోల్లా మొదలైంది వాళ్ల స్నేహం. తర్వాత ప్రేమ కారణంగా ఇద్దరి మధ్య మొదలైన వార్ చివరకు ప్రాణాలు తీసే వరకు వెళ్లింది. హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్‌ మెట్టు ప్రాంతంలో గుట్టల మధ్య ఓ డెడ్‌బాడీని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు. 


డెడ్‌బాడీని పరిశీలించిన పోలీసులు అసలు అది ఎవరిదనే కోణంలో దర్యాప్తు చేశారు. చివరకు మృతదేహం నవీన్ అనే యువకడిదని గుర్తించారు. అంతక ముందే ఆ యువకుడు మిస్సైనట్టు కేస్‌ ఫైల్‌ అయినట్టు గుర్తించారు. 


చనిపోయిందని నవీన్‌ అని ధృవీకరించుకున్న పోలీసులు కేసు విచారిస్తే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ అమ్మాయి ప్రేమ కోసం నవీన్‌ చంపేశారని తెలిసి షాక్ తిన్నారు పోలీసులు. ఆ హత్య చేసింది కూడా ఫ్రెండ్‌ హరిహర అని తేల్చారు. 


అసలేం జరిగిందంటే?


మహాత్మా గాంధీ యూనివర్సిటీలో నవీన్ ,హరిహర చదువుతున్నారు. ఆదే యూనివర్శిటీలో ఓ అమ్మాయిని వీళ్లిద్దరూ ఒకరికి తెలియకుండా ఒకరు ప్రేమించారు. 


రోజులు గడిచే కొద్ది ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు తెలుసుకున్నారు. ఇద్దరి మధ్య ద్వేషం మొదలైంది. చాలా సార్లు గొడవలు కూడా పడ్డారు. ఈ క్రమంలోనే తన ప్రేమకు నవీన్ అడ్డొస్తున్నాడని.. ఎక్కడ తనకు ఆ అమ్మాయి దక్కకుండా పోతుందో అని కంగారు పడ్డారు హరిహర. 


ఎలాగైనా నవీన్ అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేశాడు హరిహర. అప్పుడే తన ప్రేమ సక్సెస్ అవుతుందనుకున్నాడు. పార్టీ పేరుతో నవీన్‌కు ఈనెల 17న బయటకు తీసుకెళ్లాడు. అక్కడే నవీన్‌ను హత్య చేశాడు. డెడ్ బాడీని అబ్దుల్లాపూర్ మెట్టు ప్రాంతంలో పడేసి ఏమీ తెలియనట్టు ఇంటికి వచ్చేశాడు. 


సాయంత్రం అవుతున్నా నవీన్ ఇంటికి రాకపోవడంతో కంగారుపడిన ఫ్యామిలీ మెంబర్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు దర్యాప్తు చేస్తుండగానే డెడ్‌బాడీని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.  ఇంత సంచలనంగా మారిన ఈ కేసును పోలీసులు అత్యంత గోప్యంగా విచారిస్తున్నట్టు తెలుస్తోంది. విషయాన్ని బయటకు పొక్కనీయకుండా జాగ్రత్త పడుతున్నారు.