భారత్పైపగబట్టినట్టుగాఅమెరికాఅధ్యక్షుడుడొనాల్డ్ట్రంప్తీసుకుంటున్నచర్యలుఆందోళనకలిగిస్తున్నాయి. రష్యాతోసంబంధాలుకలిగిఉండమేతప్పుఅన్నట్టుట్రంప్ తనతిక్కనంతాచూపిస్తున్నారు. 2025 ఆగస్టు 7నభారత్పైటారిఫ్ రేటు 50%విధిస్తున్నట్టుపేర్కొన్నారు.రష్యా నుంచి ముడిచమురును కొనుగోలు చేస్తున్నందుకు గతంలోవిధించిన 25 శాతంటారిఫ్నకుఅదనంగామరో 25 శాతంవిధించారు.
రష్యన్ ఆయిల్ విషయంలోఅసంతృప్తి: భారతదేశం 2024-25లో రష్యా నుంచి 87.4 మిలియన్ టన్నుల ముడిచమురును దిగుమతి చేసుకుంది, ఇది మొత్తం చమురు దిగుమతులలో 36% వాటా కలిగి ఉంది. యుద్ధానికి ముందు రష్యా వాటా కేవలం 2% లోపు మాత్రమే ఉండేది. 2024లో రష్యా చమురు దిగుమతుల విలువ 52.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
ట్రంప్ ప్రభుత్వ వైఖరి:రష్యాతోభారత్పెంచుకుంటున్నసంబంధాలు, కొనుగోలుచేస్తున్నముడిచమురును"జాతీయ భద్రత" సమస్యగాట్రంప్ పేర్కొంటున్నారు. రష్యా చమురు కొనుగోలు చేసిమాస్కో యుద్ధ యంత్రానికి ఆర్థికసాయంచేస్తోందనేవాదనతెరపైకితీసుకొచ్చారు. చైనా, టర్కీ వంటి ఇతర దేశాలు రష్యా చమురు కొనుగోలు చేస్తున్నప్పటికీ, వాటిపై ఇటువంటి టారిఫ్లు విధించలేదు.
ప్రభావితమయ్యే రంగాలు
రష్యా- భారత్సంబంధాలు తప్పుపడుతూట్రంప్ వేసిన 50 శాతం టారిఫ్వల్ల ప్రధానంగా చాలా రంగాలుప్రభావితంఅవుతాయి. అందులో కొన్నింటి గురించి ఇక్కడ చూద్దాం.
వస్త్ర రంగం
ట్రంప్ టారిఫ్ల వల్ల వస్త్ర రంగం అత్యధిక దెబ్బతింటుంది. అమెరికాకు 2024-25లో 10.3 బిలియన్ డాలర్ల విలువైన వస్త్రాలు భారత్ నుంచే ఎగుమతి అయ్యాయి. ఇప్పుడు 50% టారిఫ్ వల్ల ఈ రంగం దారుణమైన పరిస్థితి ఎదుర్కొనే ఛాన్స్ ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ (CITI) అంచనా వేస్తోంది.
ప్రభావిత ఉత్పాదనలు:
- కాటన్ టీ-షర్టులు (9.71% వాటా)
- మహిళల దుస్తులు (6.52% వాటా)
- పిల్లల దుస్తులు (5.46% వాటా)
గోకల్దాస్ ఎక్స్పోర్ట్, వెల్స్పన్లివింగ్, ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ వంటి కంపెనీలకుఆదాయం 50 నుంచి 70 శాతంఅమెరికామార్కెట్నుంచేవస్తున్నాయి. ఇప్పుడుఆఆదాయంపైపెనుప్రభావంచూపేఅవకాశాలుఎక్కువగాఉన్నాయి.
జెమ్ అండ్ జ్యువెలరీరంగం
ట్రంప్ టారిఫ్తోరత్నాలు -నగల రంగం కూడా తీవ్ర ప్రభావానికి గురవుతుంది. 2024-25లో అమెరికాకు ఇండియాదాదాపు 10 బిలియన్ డాలర్ల జెమ్స్ అండే జ్యువెలరీలు ఎగుమతి చేసింది. 30 శాతంవాటాకలిగినఅమెరికాటారిఫ్లుపెంచడంకచ్చితంగాఎఫెక్ట్ఉంటుందనిజెమ్ అండ్ జ్యువెలరీఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆందోళనవ్యక్తంచేస్తోంది.
రొయ్యల ఎగుమతులు
రొయ్యల ఎగుమతులు అత్యధిక టారిఫ్నుఎదుర్కోవాల్సివస్తోంది. ఇప్పటికే 5.77 శాతం కౌంటర్వైలింగ్ డ్యూటీ, 2.49 శాతం యాంటీ-డంపింగ్ పన్ను అమెరికా విధిస్తోంది. ఇప్పుడు వీటికి అదనంగా50శాతంటారిఫ్అమలుఅయితేమాత్రంపన్ను భారం 58.26శాతానికిచేరుకుంటుంది. కేవలం 15 శాతంటారిఫ్తోఉన్నఈక్వడార్తోభారత్పోటీపడాల్సిఉంటుంది.
ఔషధ రంగం
ప్రస్తుతంమెడిసిన్పైటారిఫ్ ప్రభావంలేదు. కానీభవిష్యత్లోమాత్రంఫార్మారంగంపైకచ్చితంగా 250కుపైగాటారిఫ్వేస్తామనిఈమధ్యేట్రంప్హెచ్చరించారు. అమెరికాలోఔషధాలతయారీనిపెంచుకునేందుకుచేసేప్రయత్నాల్లోపన్నులుపెంచుతామనిచెబుతున్నారు. భారత్నుంచి2024-25లో $10.5 బిలియన్ల ఔషధాలుఅమెరికాదిగుమతిచేసుకుంది. ఫార్మా ఎగుమతుల్లో 31%అన్నమాట. దీన్నివీలైనంతతగ్గించాలనిట్రంప్ఆలోచిస్తున్నారు.
ఆటో కాంపోనెంట్స్
ఆటో కాంపోనెంట్స్ రంగం అమెరికాటారిఫ్స్తోప్రభావితమవుతుంది. మిగతారంగాలతోపోలిస్తేతక్కువేఅయినప్పటికీఎఫెక్ట్అయితేఉంటుంది. గతేడాదిఈరంగంనుంచిఅమెరికాకు $7 బిలియన్ల ఆటోపార్ట్స్ ఎగుమతి అయ్యాయి. ఇప్పటికేఈరంగంపై 25 శాతంటారిఫ్అమలులోఉంది. ఇప్పుడుకొత్తగాఎలాంటిటారిఫ్విధించలేదు.
ఈ ట్రంప్ టారిఫ్లపై గ్లోబల్ ట్రేడ్ రిసర్చ్ ఇనిషియేటివ్ లెక్కలు వేసింది. వీటి ఫలితంగా 40 నుంచి 50 శాతం వరకు ఎగుమతులపై ప్రభావం పడుతుందని ఓ అంచనా ఉంది. దీని ప్రభావంతో దాదాపు 45.4 బిలియన్ డాలర్లు ఎఫెక్ట్ అవుతాయి. ఇది భారత్ జీడీపీ ప్రభావం చూపుతుంది. 7% నుంచి 6%కి తగ్గించగలవని అంటున్నారు.
అమెరికాలోధరలుపెరిగేవస్తువులు
- భారత్ దేశంనుంచిఎగుమతిఅయ్యేవస్తువులధరలుఅమెరికాలోపెరగబోతున్నాయి.
- వస్త్రాలు: భారతీయ టీ-షర్టులు, దుస్తులు, హోమ్ టెక్స్టైల్స్ 50% వరకు ధరపెరుగుతాయి.
- నగలు: వజ్రాలు- బంగారు నగలు
- రొయ్యలు: భారతీయ రొయ్యలు 58శాతంమేరధరలుపెరిగేఅవకాశంఉంది.
భారత్, బ్రెజిల్పైసమానంగానేట్రంప్ 50 శాతంటారిఫ్ వేశారు. చైనా, శ్రీలంకపై30శాతం, వియత్నాం, ఫిలిప్పీన్స్పై20శాతం, బంగ్లాదేశ్పై35శాతం, మలేషియాపై25శాతం, థాయిలాండ్, కంబోడియాపై36శాతంటారిఫ్వేశారు.
ట్రంప్ టారిఫ్ భారత-అమెరికా వాణిజ్య సంబంధాల్లో ఇదోకొత్తదశగాచెబుతున్నారుమార్కెట్నిపుణులు. ఇలాంటిసంక్షోభసమయాన్నిభారతీయ ఎగుమతుదారులుఆల్ట్రనేటివ్ ప్రయత్నాలుచేయాలనివస్తువుకుమరింతవాల్యూజోడించాలనిసూచిస్తున్నారు. సాంకేతికంగాఅప్గ్రేడ్అవ్వాలనిచెబుతున్నారు.
