Stock Market Today, 20 February 2024: నిన్న రికార్డు స్థాయిలో ముగిసిన నిఫ్టీ, ఈ రోజు (మంగళవారం) ట్రేడింగ్ సెషన్‌ను నిరాడంబరంగా ప్రారంభించే అవకాశం ఉంది. ఈ రోజు ఉదయం మిక్స్‌డ్‌గా ట్రేడ్‌ అవుతున్న ఆసియా మార్కెట్లు ఇండియన్‌ ఈక్విటీలపై ప్రభావం చూపించొచ్చు.


ఉదయం 8.15 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 66 పాయింట్లు లేదా 0.3 శాతం గ్రీన్‌ కలర్‌లో 22,180 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది. 


గ్లోబల్‌ మార్కెట్లు
ఆసియా మార్కెట్లలో.. ఈ ఉదయం, నికాయ్‌, హాంగ్ సెంగ్, తైవాన్ 0.5 శాతం చొప్పున పెరిగాయి. స్ట్రెయిట్స్ టైమ్స్ ఫ్లాట్‌గా ఉండగా, కోస్పి 0.5 శాతం క్షీణించింది.


నిన్న ప్రెసిడెంట్స్ డే సెలవు కారణంగా US మార్కెట్‌లో ట్రేడింగ్ జరగలేదు. 


US 10-ఇయర్స్ బాండ్ ఈల్డ్ 4.3 శాతం స్థాయిలో ఉంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు దాదాపు $83.50 స్థాయికి చేరాయి.


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 


వర్ల్‌పూల్: ప్రమోటర్ కంపెనీ వర్ల్‌పూల్ మారిషస్ (WML), వర్ల్‌పూల్ ఇండియాలో 30.4 మిలియన్ షేర్లు లేదా 24 శాతం ఈక్విటీ వాటాను బ్లాక్ డీల్స్ ద్వారా ఈ రోజు అమ్మబోతోంది. ఒక్కో షేరును రూ. 1,230 చొప్పున విక్రయించాలని భావిస్తున్నట్లు నేషనల్‌ మీడియాలో రిపోర్ట్స్‌ వచ్చాయి.


లార్సెన్ & టూబ్రో: 2024 సెప్టెంబర్‌లో ఎలక్ట్రోలైజర్ల వాణిజ్య విక్రయాలను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. యూరోపియన్ పోటీ సంస్థల కంటే 50 శాతం తక్కువ ధరలో ఇది ఉండొచ్చు.


ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: మూడేళ్లలో, బ్యాంక్‌ సురక్షిత రుణ పోర్ట్‌ఫోలియోను 40 శాతానికి పెంచాలని యోచిస్తున్నట్లు బ్యాంక్‌ మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇట్టిరా డేవిస్ చెప్పారు. ప్రస్తుతం, సెక్యూర్డ్ లోన్‌ పోర్ట్‌ఫోలియో 28.3 శాతంగా ఉంది.


బలరాంపూర్ చీని మిల్స్‌: పాలీ లాక్టిక్ యాసిడ్ తయారీ వ్యాపారంలోకి ప్రవేశించడానికి వచ్చే 30 నెలల వ్యవధిలో రూ. 2,000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టడానికి ప్లాన్‌ సిద్ధం చేసింది. 


CIE ఆటోమోటివ్: 2023 డిసెంబర్‌ త్రైమాసికంలో గట్టిగా తిప్పుకుంది, రూ. 169 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని సాధించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో రూ. 658 కోట్ల నికర నష్టం వచ్చింది.


మాస్టెక్: 39,189 కంపల్సరీ కన్వర్టిబుల్ ప్రిఫరెన్స్ షేర్లను, ఒక్కో షేరును రూ. 2,382 చొప్పున కేటాయించేందుకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది.


ఓరియంటల్ రైల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్: 5.06 మిలియన్ ఈక్విటీ షేర్ల కేటాయింపు & 7.50 మిలియన్ వారెంట్‌లను ఒక్కో షేరుకు రూ.169 చొప్పున ఈక్విటీ షేర్‌లుగా మార్చేందుకు ఈ నెల 22న కంపెనీ డైరెక్టర్ల బోర్డ్‌ సమావేశం కానుంది.


NBCC: రూ.3,690 కోట్ల విలువైన ఆర్డర్‌లు సాధించింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: ఈ పెళ్లిళ్ల సీజన్‌లో గోల్డ్‌ కొనగలమా? - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవే