IT Sector Stocks: 


కొవిడ్‌ సంక్షోభంలో.. ఆ తర్వాత ఐటీ రంగం బలంగా పుంజుకుంది. ఇతర రంగాల కంపెనీలన్నీ డిజిటల్‌ బాట పట్టడంతో ఐటీ కంపెనీలకు (IT Companies) లాభాలు వచ్చాయి. అలాంటిది ఏడాదిన్నరగా ఇబ్బంది పడుతున్నాయి. ఆదాయం, నికర లాభం వంటి అంచనాలను తగ్గిస్తున్నాయి. అమెరికా, ఐరోపాలో ఆర్థిక మందగమనం ఉండటమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో మరో ఆరు నెలల వరకు ఐటీ కంపెనీల షేర్ల జోలికి వెళ్లకపోవడమే మంచిదని హీలియోస్‌ క్యాపిటల్‌ ఫౌండర్‌ సమీర్‌ అరోరా అంటున్నారు. 


'సాధారణంగా మాకు మూడు అతిపెద్ద థీమ్స్‌ ఉన్నాయి. అవి ఫైనాన్షియల్స్‌, కన్జూమర్‌, ఐటీ. కానీ ఏడాది కాలంగా ఐటీని మేం పరిగణనలోకి తీసుకోవడం లేదు. మరో ఆరు నెలల వరకు ఆ కంపెనీల్లో పెట్టుబడి పెట్టడం లేదు. వారం రోజుల క్రితం ఒకే రోజు ఆరుగురు బ్రోకర్లు ఐటీ రంగంలోని కంపెనీల ఎర్నింగ్స్‌పై రేటింగ్‌ను తగ్గించారు. ఈ ఆరుగురూ ఒకేసారి అలా ఎలా తగ్గిస్తారు' అని సమీర్‌ ప్రశ్నించారు.


Also Read: అద్దెకు ఉంటున్నారా! టెనెంట్‌గా ఈ హక్కులు మీకున్నాయని తెలుసా!


ఐటీ కంపెనీల ప్రతినిధులే బ్రోకర్లను పిలిచి ఈ విషయం చెప్పి ఉండొచ్చని సమీర్‌ అనుమానిస్తున్నారు. 'కంపెనీలు బ్రోకర్లను పిలిచి.. వారి అంచనాలు తప్పని చెప్పిఉంటాయి. మేం ఫలితాలు విడుదల చేసే రోజు మార్కెట్‌ అంచనాల మేరకు రాణించడం లేదన్న ముద్ర వద్దనుకుంటున్నాం. దయచేసి అంచనాలను తగ్గించండని అడిగి ఉంటాయి. ఈ వ్యవహారం అనలిస్టులు చాలా స్మార్ట్‌ అన్న భ్రమ కలిగిస్తుంది. కంపెనీలు మరీ అంత దారుణంగా ఏమీ లేవని భావించేలా చేస్తాయి. ప్రజలు, ఫారిన్‌ ఇన్వెస్టర్లు ఐటీ రంగంపై సానుకూలంగా ఉన్నప్పటికీ కష్టాలు రెండు, మూడు నెలల్లో పోవనే అనుకుంటున్నా' అని ఆయన తెలిపారు.


'పరిస్థితులు బాగా లేవంటే కనీసం ఏడాది వరకు అలాగే ఉంటుంది. ఒక పెద్ద కంపెనీ ఫలితాలు 8-12 త్రైమాసికాలు నిరాశపరిచాయంటే అది పుంజుకుంటుందని అనుకోలేం. తర్వాతి త్రైమాసికంలో అంతా బాగుపడుతుందని భావించలేం. తిరిగి పుంజుకోవడానికి కనీసం ఆరు నెలలు పడుతుంది. మార్గదర్శకాలు, అంచనాలను రీసెట్‌ చేయడం, కొత్త వాల్యుయేషన్లు రావడం వంటివి అవకాశాలు సృష్టించొచ్చు. సాధారణంగా మేం 20 శాతం నిధులను ఐటీలో పెట్టుబడి పెడతాం. కాకపోతే జొమాటో, పేటీఎం వంటి డిజిటల్‌, ఫైనాన్షియల్‌ కంపెనీల్లో 7 శాతం వరకు ఇన్వెస్ట్‌ చేస్తున్నాం' అని సమీర్‌ వివరించారు.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial  


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.