Stock Market News Today in Telugu: భారత స్టాక్ మార్కెట్‌లో మళ్లీ బుల్లిష్ ట్రెండ్ తిరిగి వచ్చింది. ఈ రోజు (మంగళవారం, 23 ఏప్రిల్‌ 2024) సెన్సెక్స్‌ & నిఫ్టీ బలమైన ఆరంభాన్ని ఇచ్చాయి. ఇండియా ఓలటాలిటీ ఇండెక్స్ ఇండియా విక్స్ అత్యంత కనిష్ట స్థాయికి చేరుకుంది. నిఫ్టీ బ్యాంక్‌కు బూస్ట్‌ దొరికింది, 48,000 స్థాయికి పైన ట్రేడవుతోంది. 


ఈ రోజు మన మార్కెట్ ఇలా ప్రారంభమైంది...


గత సెషన్‌లో (సోమవారం) 73,648 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 400.32 పాయింట్లు లేదా 0.54 శాతం పెరుగుదలతో 74,048.94 దగ్గర (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. సోమవారం 22,336 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 110.65 పాయింట్లు లేదా 0.50 శాతం లాభంతో 22,447.05 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 


విస్తృత మార్కెట్లలో... BSE మిడ్‌ క్యాప్ ఇండెక్స్‌ 0.39 శాతం & స్మాల్‌ క్యాప్ ఇండెక్స్‌ 0.67 శాతం లాభపడ్డాయి.


సెక్టార్ల వారీగా చూస్తే... 


ఈ రోజు బిజినెస్‌ ప్రారంభమైనప్పుడు సెన్సెక్స్‌ 30 ఇండెక్స్‌లో 24 షేర్లు అప్‌ట్రెండ్‌లో ఉన్నాయి, మిగిలిన 6 షేర్లు డౌన్‌ట్రెండ్‌లో ఉన్నాయి. సెన్సెక్స్‌ టాప్‌ గెయినర్స్‌లో... భారతి ఎయిర్‌టెల్ 1.73 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 1.37 శాతం చొప్పున పెరిగాయి. ఎన్‌టీపీసీ, బజాజ్ ఫిన్‌సర్వ్, కోటక్ మహీంద్ర బ్యాంక్, టైటన్ కూడా ఫార్వర్డ్‌ మోడ్‌లో ఉన్నాయి. సెన్సెక్స్‌ టాప్‌ లూజర్స్‌లో.. ఎల్‌&టీ, పవర్ గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ ఉన్నాయి.


నిఫ్టీ50 ప్యాక్‌లో... 33 షేర్లు బలాన్ని ప్రదర్శించగా, 16 షేర్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. 1 స్టాక్‌లో ఎలాంటి మార్పు లేదు. నిఫ్టీ టాప్ గెయినర్స్‌లో భారతి ఎయిర్‌టెల్ అగ్రగామిగా ఉంది, 1.73 శాతం పెరిగింది. హెచ్‌సీఎల్ టెల్ 1.29 శాతం, టాటా మోటార్స్ 1.07 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ టాప్‌ లూజర్స్‌లో... హిందాల్కో దాదాపు ఒక శాతం పడిపోయింది. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, పవర్‌గ్రిడ్, టాటా కన్స్యూమర్స్, బ్రిటానియా ఇండస్ట్రీస్ షేర్లు క్షీణిస్తున్నాయి.


ఓపెనింగ్‌ టైమ్‌లో, BSEలో మొత్తం 2,966 షేర్లు ట్రేడ్ అవుతుండగా.. వాటిలో 2,040 షేర్లు లాభాల్లో ఉన్నాయి. 828 షేర్లు క్షీణించాయి. 98 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. 136 స్టాక్స్‌ 52 వారాల గరిష్ఠ స్థాయిలో, 7 స్టాక్స్‌ 52 వారాల కనిష్ఠ స్థాయిలోనూ ట్రేడవుతున్నాయి. 171 షేర్లు అప్పర్ సర్క్యూట్‌లో, 55 షేర్లు లోయర్ సర్క్యూట్‌లో ఆగిపోయాయి. NSEలో 1,817 షేర్లు పచ్చగా, 166 షేర్లు ఎరుపు రంగులో ట్రేడ్‌ చేశాయి.


బీఎస్‌ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ ‌(BSE Market Capitalization)
BSE మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 399.44 లక్షల కోట్లకు చేరుకుంది, మళ్లీ రూ. 400 లక్షల కోట్ల మార్క్‌కు చేరుకునే ఛాన్స్‌ ఉంది. 


ఈ రోజు ఉదయం 10.10 గంటల సమయానికి, BSE సెన్సెక్స్‌ 276.07 పాయింట్లు లేదా 0.37% పెరిగి 73,924.69 దగ్గర; NSE నిఫ్టీ 77.00 పాయింట్లు లేదా 0.34% పెరిగి 22,413.40 వద్ద ట్రేడవుతున్నాయి. 


గ్లోబల్‌ మార్కెట్లు
ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లలో.. ఈ ఉదయం, జపాన్‌కు చెందిన నికాయ్‌ ఆకుపచ్చ రంగుతో 0.38 శాతం, టోపిక్స్ ఇండెక్స్ 0.50 శాతం పెరిగాయి. దక్షిణ కొరియాకు చెందిన కోస్పి 0.28 శాతం పెరిగింది. ఆస్ట్రేలియాలోని S&P/ASX 200 0.52 శాతం యాడ్‌ చేసుకోగా, హాంకాంగ్‌లోని హ్యాంగ్‌ సెంగ్‌ ఇండెక్స్‌ 0.63 శాతం ఎగబాకింది. 


USలో నిన్న మూడు సూచీలు లాభాల్లో స్థిరపడ్డాయి. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.67 శాతం జోడిస్తే, S&P 500 0.87 శాతం పెరిగింది. నాస్‌డాక్ కాంపోజిట్ 1.11 శాతం ర్యాలీ చేసింది.


అమెరికన్‌ బెంచ్‌మార్క్‌ 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్ 4.619 శాతం వద్ద ఉంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ $87 వద్ద ట్రేడ్‌ అవుతోంది. గోల్డ్ ఒక్కసారిగా దూసుకెళ్లింది, ఔన్సుకు $2,326 దగ్గర ఉంది. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవే