Petrol Price Today on 19th March 2022: హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ ధరలలో ఏ మార్పు లేదు. గత మూడు నెలలుగా ఇంధన ధరలు ఇక్కడ నిలకడగా ఉన్నాయి. నేడు హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ ధర (Petrol Price Today 19th March 2022) రూ.108.20 కాగా, డీజిల్ ధర లీటర్ రూ.94.62 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఉక్రెయిన్, రష్యా యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు బ్యారెల్ ధర 102 డాలర్లు అయింది. ఢిల్లీలోనూ గత డిసెంబర్ తొలి వారం నుంచి పెట్రోల్ లీటర్ ధర రూ.95.41, డీజిల్ ధర రూ.86.67 వద్ద స్థిరంగా ఉన్నాయి. 


తెలంగాణలో ఇంధన ధరలు..
ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర (Petrol Price In Warangal) నిలకడగా ఉంది. వరంగల్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.107.69 కాగా, డీజిల్‌‌పై 43 పైసలు దిగిరావడంతో లీటర్ ధర రూ.94.14 కు పడిపోయింది. 
వరంగల్ రూరల్ జిల్లాలో పెట్రోల్‌ లీటర్ ధర రూ.107.92 కాగా, డీజిల్‌‌‌పై 4 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.94.35 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
కరీంనగర్‌లో ఇంధన ధరలు (Petrol Price in Karimnagar) నిలకడగా ఉన్నాయి. నేడు కరీంనగర్‌లో పెట్రోల్ ధర రూ.108.38 కాగా, డీజిల్ ధర రూ.94.78 గా ఉంది.
నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి. నిజామాబాద్‌లో 48 పైసలు పెరగంతో పెట్రోల్ లీటర్ ధర రూ.109.93 కాగా, డీజిల్‌‌పై 45 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.96.23కి దిగొచ్చింది.  
ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ రేట్స్..
విజయవాడలో పెట్రోల్‌ (Petrol Price in Vijayawada 19th March 2022)పై 62 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.110.29 కాగా, ఇక్కడ డీజిల్ పై 60 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.96.36 అయింది. 
విశాఖపట్నంలో ఇంధన ధరలు తగ్గాయి. 10 పైసలు తగ్గడంతో విశాఖలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.30 అయింది. డీజిల్‌పై 10 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.95.41గా ఉంది.
చిత్తూరులో ఇంధన ధరలు దిగొచ్చాయి. పెట్రోల్‌ పై 12 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.110.58కి పతనమైంది. డీజిల్ పై 8 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.96.60 అయింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. 


ధరల పెరుగుదలకు కారణం..
మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై పడి వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడులతో క్రూడాయిల్ ధరలు అంతర్జాతీయంగా పెరుగుతున్నాయి. దాని ప్రభావం పలు దేశాలపై పడింది. భారత్‌లోనూ ఇంధన ధరలు త్వరలో పెరిగే అవకాశం ఉంది. పెట్రోల్ లీటర్ ధర రూ.150 నుంచి రూ.180కి పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంధన ధరలు సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.