Salary Hike To Central Government Employees: 8వ వేతన సంఘం ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఎదురు చూపులు ముగిశాయి, కేంద్ర ప్రభుత్వం ఈ కమిషన్ను ఆమోదించింది. ఈ కమిషన్ చేసే సిఫార్సులు మిలియన్ల మంది ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను రెట్టింపు చేయగలవు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, జీతాలు 108 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో పెరుగుదల ప్రధానంగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్పై ఆధారపడి ఉంటుంది, ఇది ప్రస్తుతం 2.57గా ఉంది. 8వ వేతన సంఘం సిఫార్సుల తర్వాత ఇది 2.86 కి పెరుగుతుందని ఒక అంచనా. ఇదే జరిగితే, ప్యూన్ నుంచి ఆఫీసర్ వరకు అన్ని లెవెల్స్లోని ప్రభుత్వ ఉద్యోగుల కనీస ప్రాథమిక జీతం (Basic pay) 100 శాతానికి పైగా పెరుగుతుంది.
ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎలా వర్తిస్తుంది?
ఫిట్మెంట్ ఫ్యాక్టర్ జీతం పెరుగుదలను నిర్ణయించే ముఖ్యమైన గుణకం/గణాంకం. 7వ వేతన సంఘంలో ఇది 2.57గా ఉంది, దీని కారణంగా లెవల్-1 ఉద్యోగుల మూల వేతనం (Basic pay) రూ. 7,000 నుంచి రూ. 18,000కు పెరిగింది. కరవు భత్యం (DA), ఇంటి అద్దె భత్యం (HRA), రవాణా భత్యాలను కలిపితే మొత్తం జీతం రూ. 36,020 అయింది. 8వ వేతన సంఘంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.86 కు పెరిగితే, లెవల్-1 ఉద్యోగుల మూల వేతనం రూ. 18,000 నుంచి రూ. 51,480కు పెరగవచ్చు. అదే తరహాలో లెవల్-10 వరకు ఉన్న అధికారుల జీతం కూడా పెరుగుతుంది.
లెవల్-1 నుంచి లెవల్-10 వరకు ప్రభుత్వ సిబ్బంది ప్రస్తుత మూల వేతనం & పెరగనున్న మూల వేతనం అంచనా:
లెవెల్ 1
ప్రస్తుత కనీస జీతం: రూ. 18,000 --- పెరగనున్న మూల వేతనం అంచనా: రూ. 51,480
లెవెల్ 2
ప్రస్తుత కనీస జీతం: రూ. 19,900 --- పెరగనున్న మూల వేతనం అంచనా: రూ. 56,914
లెవెల్ 3
ప్రస్తుత కనీస జీతం: రూ. 21,700 --- పెరగనున్న మూల వేతనం అంచనా: రూ. 62,062
లెవెల్ 4
ప్రస్తుత కనీస జీతం: రూ. 25,500 --- పెరగనున్న మూల వేతనం అంచనా: రూ. 72,930
లెవెల్ 5
ప్రస్తుత కనీస జీతం: రూ. 29,200 --- పెరగనున్న మూల వేతనం అంచనా: రూ. 83,512
లెవెల్ 6
ప్రస్తుత కనీస జీతం: రూ. 35,400 --- పెరగనున్న మూల వేతనం అంచనా: రూ. 1,01,244
లెవెల్ 7
ప్రస్తుత కనీస జీతం: రూ. 44,900 --- అంచనా వేసిన కొత్త జీతం: రూ. 1,28,000
లెవెల్ 8
ప్రస్తుత కనీస జీతం: రూ. 47,600 --- పెరగనున్న మూల వేతనం అంచనా: రూ. 1,36,136
లెవెల్ 9
ప్రస్తుత కనీస జీతం: రూ. 53,100 --- పెరగనున్న మూల వేతనం అంచనా: రూ. 1,51,866
లెవెల్ 10
ప్రస్తుత కనీస జీతం: రూ. 56,100 --- పెరగనున్న మూల వేతనం అంచనా: రూ. 1,60,446
8వ వేతన సంఘం ఎప్పుడు ఏర్పాటవుతుంది?
8వ వేతన సంఘం కింద జీతాల పెంపుదల ప్రధాన లక్ష్యం.. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఉద్యోగులకు సరైన జీతం ఇవ్వడం. ఇది, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 8వ వేతన సంఘం. ఏడో వేతన సంఘం కాల గడువు ముగిసేలోపు ఎనిమిదో వేతన సంఘం తన నివేదికను సమర్పిస్తుంది. ఈ సంవత్సరం చివరి నాటికి 8వ వేతన సంఘం ఏర్పాటవుతుంది & తన నివేదికను జనవరి 2026 నాటికి సమర్పిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతం ఎంత పెరుగుతుందో అప్పుడు తెలుస్తుంది. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను గరిష్ట స్థాయిలో ఉంచాలని ఉద్యోగి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
మరో ఆసక్తికర కథనం: బడ్జెట్ ప్రకటనతో బ్యాంకుల్లోకి డబ్బుల వరద - అదనంగా రూ.45,000 కోట్లు!