Stock Market Opening Bell 23 August 2022: రెండు రోజుల భారీ నష్టాలకు చెక్‌! భారత స్టాక్‌ మార్కెట్లు మంగళవారం అతి స్వల్ప లాభాల్లో ఓపెనయ్యాయి. ఉదయం నుంచి తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలేమీ లేవు. డాలర్‌ మళ్లీ పుంజుకోవడం, క్రూడాయిల్‌ ధరలు పెరగడంతో మదుపర్లు ఆందోళనకు గురవుతున్నారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 10 పాయింట్ల లాభంతో 17,497 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 5 పాయింట్ల లాభంతో 58,778 వద్ద కొనసాగుతున్నాయి.


BSE Sensex


క్రితం సెషన్లో 58,789 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 58,205 వద్ద మొదలైంది. 58,172 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,068 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 5 పాయింట్ల లాభంతో 58,778 వద్ద కొనసాగుతోంది.


NSE Nifty


సోమవారం 17,490 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 17,357 వద్ద ఓపెనైంది. 17,345 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,558 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 10 పాయింట్ల లాభంతో 17,497 వద్ద ట్రేడవుతోంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌  స్వల్ప లాభాల్లో ఉంది. ఉదయం 37,955 వద్ద మొదలైంది. 37,950 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 38,569 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 101 పాయింట్ల లాభంతో 38,399 వద్ద కొనసాగుతోంది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 32 కంపెనీలు లాభాల్లో 17 నష్టాల్లో ఉన్నాయి. బజాజ్‌, సిప్లా, గ్రాసిమ్‌, ఎం అండ్‌ ఎం, ఐచర్‌ మోటార్స్‌ లాభాల్లో ఉన్నాయి. అదానీ పోర్ట్స్‌, ఇన్ఫీ, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఐటీ, మీడియా, కన్జూమర్‌ డ్యురబుల్స్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్షియల్స్‌, ఫార్మా, హెల్త్‌కేర్‌ సూచీలు లాభాల్లో ఉన్నాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.