Stock Market @12 PM 15 June 2022: భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) గురువారం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో ఉదయం సూచీలు దూసుకుపోయాయి. సెన్సెక్స్‌ ఏకంగా 500+ లాభపడింది. ఆ తర్వాత ఫెడ్‌ వడ్డీరేట్లను 75 బేసిస్‌ పాయింట్ల మేర పెంచుతుందన్న వార్తలతో అమ్మకాలు పెరిగాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 90 పాయింట్ల నష్టంతో 15,601, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 260 పాయింట్ల నష్టంతో 52,277 వద్ద ఉన్నాయి.


BSE Sensex


క్రితం సెషన్లో 52,541  వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 53,246 వద్ద భారీ లాభాల్లో మొదలైంది. 52,246 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 53,142 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో 260 పాయింట్ల నష్టంతో 52,277 వద్ద కొనసాగుతోంది. సింగపూర్‌ నిఫ్టీ నుంచి సానుకూల సంకేతాలు రావడంతో ఉదయం 500 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్‌ ఇప్పుడు నష్టాల్లోకి జారుకుంది.


NSE Nifty


బుధవారం 15,692 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 15,832 వద్ద ఓపెనైంది. 15,587 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 15,863 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 90 పాయింట్ల నష్టంతో 15,601 వద్ద చలిస్తోంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ నష్టాల్లో ఉంది. ఉదయం 33,648 వద్ద మొదలైంది. 33,103 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 33,756 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 186 పాయింట్ల నష్టంతో 33,152 వద్ద కొనసాగుతోంది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 9 కంపెనీలు లాభాల్లో 41 నష్టాల్లో ఉన్నాయి. మారుతీ, బ్రిటానియా, ఐసీఐసీఐ బ్యాంక్‌, రిలయన్స్‌, ఆసియన్‌ పెయింట్స్‌ షేర్లు స్వల్ప లాభాల్లో ఉన్నాయి. హిందాల్కో, సిప్లా, టాటా స్టీల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఓఎన్‌జీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. దాదాపుగా అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. మీడియా, మెటల్‌, రియాల్టీ సూచీలు ఒక శాతానికి పైగా పతనం అయ్యాయి. మిగతావి 0.50 శాతం వరకు నష్టాల్లో ఉన్నాయి.