Stock Market Opening 06 December 2022:


భారత స్టాక్‌ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో మొదలయ్యాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందలేదు. ఐటీ, మెటల్‌ షేర్లపై సెల్లింగ్‌ ప్రెజర్‌ ఉంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 93 పాయింట్ల నష్టంతో 18,607 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 304 పాయింట్ల నష్టంతో 62,529 వద్ద కొనసాగుతున్నాయి. పీఎస్‌యూ బ్యాంకు షేర్లు మాత్రం రప్ఫాడిస్తున్నాయి.


BSE Sensex


క్రితం సెషన్లో 63,834 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 62,395 వద్ద మొదలైంది. 62,390 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 62,644 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11 గంటలకు 304 పాయింట్ల లాభంతో 62,529 వద్ద కొనసాగుతోంది.


Also Read: నెలకు రూ.12,500 కట్టండి చాలు, ఏకంగా కోటి రూపాయలు మీ చేతికొస్తాయి


NSE Nifty


సోమవారం 18,701 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 18,607 వద్ద ఓపెనైంది. 18,677 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,648 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 93 పాయింట్ల నష్టంతో 18,607 వద్ద ట్రేడవుతోంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ ఎరుపెక్కింది. ఉదయం 43,093 వద్ద మొదలైంది. 43,091 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,306 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుం 176 పాయింట్లు పతనమై 43,156 వద్ద కొనసాగుతోంది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 12 కంపెనీలు లాభాల్లో 38 నష్టాల్లో ఉన్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, హిందుస్థాన్‌ యునీలివర్‌, బ్రిటానియా, బజాజ్ ఫైనాన్స్‌, ఎస్‌బీఐ లైఫ్ షేర్లు లాభపడ్డాయి. హిందాల్కో, టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, యూపీఎల్‌, టెక్ మహీంద్రా షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంక్‌ మినహా అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. ఐటీ, మీడియా, మెటల్‌, ఫార్మా, రియాల్టీ, హెల్త్‌కేర్‌ సూచీలు ఎక్కువ నష్టపోయాయి. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.