భారత్‌లో బంగారం ధర ఈ రోజు (ఆగస్టు 9) అతి స్వల్పంగా తగ్గింది. గ్రాముకు కేవలం రూ.1 మాత్రమే వ్యత్యాసం కనిపించింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ (ఆగస్టు 9)న రూ.45,690 గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర తాజాగా రూ.46,690 గా ఉంది. మొత్తానికి గత 10 రోజుల ధరలతో పోలిస్తే పసిడి ధర బాగా తగ్గింది. ముందు రోజుతో పోలిస్తే నేటి ధరల్లో 10 గ్రాములకు కేవలం రూ.10 తేడానే కనిపించింది.


భారత మార్కెట్‌లో బంగారం ధరలు అతి స్వల్పంగా వెండి ధరలు మాత్రం నిలకడగా ఉన్నాయి. వెండి ధరల్లో గత 10 రోజులుగా హెచ్చుతగ్గులు కనిపిస్తుండగా నిన్న కాస్త ఎక్కువ తగ్గుదల కనిపించింది. అయితే, నేడు మాత్రం స్థిరంగా ఉన్నాయి. తాజాగా భారత్‌లో కిలో వెండి ధర రూ.65 వేలుగానే కొనసాగుతోంది. హైదరాబాద్‌ మార్కెట్‌లో కూడా కిలో వెండి ధర రూ.65,000 ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ముఖ్య నగరాల్లో ఆగస్టు 9న బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.


తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి తాజా ధరలివీ..
హైదరాబాద్‌లో కూడా 24 క్యారెట్ల ప్యూర్ బంగారం (99.99) ధర గ్రాముకు రూ.1 మాత్రమే తగ్గింది. ఈ మేరకు ప్రస్తుతం రూ.47,830 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం (91.6) ధర రూ.43,840 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.65,000 పలికింది. ముందు రోజుతో పోలిస్తే వెండి ధర హైదరాబాద్‌లో భారీగా తగ్గింది.


ఇక విజయవాడలో 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ఆగస్టు 9న రూ.43,840 కాగా.. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.47,830గా ఉంది. విజయవాడలో ఆగస్టు 8తో పోలిస్తే ధర గ్రాముకు రూ.1 మాత్రమే తగ్గింది. ఇక్కడ కిలో వెండి ధర రూ.70,200గా ఉంది. విజయవాడ మార్కెట్‌లో వెండి ధరలో మార్పు కనిపించలేదు. ఇక విశాఖపట్నం పసిడి మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,840 గానే ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,830గా ఉంది. ఇక్కడ కూడా వెండి ధర కిలో రూ.70,200 పలుకుతోంది.


దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఆగస్టు 9న ఇలా ఉన్నాయి. ముంబయిలో ఈరోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.45,690ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,690గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,390 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,430గా ఉంది.


ప్లాటినం ధర నిలకడగా..
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర హైదరాబాద్‌లో గ్రాముకు రూ.2,330గా ఉంది. ముందు రోజుతో పోలిస్తే ఈ ధర నిలకడగానే ఉంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.23,300 గా ఉండగా.. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర అదే కొనసాగుతోంది.


అనేక అంశాలపై పసిడి ధర
బంగారం ధరల్లో ప్రతిరోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఓ కారణం. అయితే, ఇలా గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తాయి.