మన దేశంలో బంగారం ధరల పెరుగుదల లేదా తగ్గుదల అనేది పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది. వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో ఫ్యాక్టర్స్ బంగారం ధరను నిర్ణయిస్తాయి. ఏపీ, తెలంగాణలోని ముఖ్య నగరాల్లో తాజా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
భారత్లో 10 గ్రాముిల బంగారం ధర ఈ రోజు (ఆగస్టు 6) రూ.20 పెరిగింది. ఆగస్టు 5న రూ.46,950గా ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర, ఇవాళ (ఆగస్టు 6)న రూ.46,950కి పెరిగింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా ముందురోజు రూ.47,950 గా ఉండగా.. నేడు రూ.47,970కి చేరింది. మొత్తానికి గత 10 రోజుల ధరలతో పోలిస్తే సుమారు రూ.200 మేర పెరిగింది.
బంగారం ధరలు పెరగగా వెండి ధరలు మాత్రం కాస్త తగ్గాయి. వెండి ధరల్లో గత 10 రోజులుగా హెచ్చుతగ్గులు కనిపిస్తూనే ఉన్నా.. తాజాగా భారత్లో కిలో వెండి ధర రూ.67,600గా ఉంది. నిన్న (ఆగస్టు 5న) రూ.68,000గా ఉంది. నిన్నటితో పోలిస్తే వెండి ధర తాజాగా రూ.400 వరకూ తగ్గింది.
హైదరాబాద్, విజయవాడల్లో బంగారం, వెండి తాజా ధరలివీ..
హైదరాబాద్లో 24 క్యారెట్ల మేలిమి బంగారం (బిస్కెట్ బంగారం) ధర రూ.48,880గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.44,800గా కొనసాగుతోంది. స్వచ్ఛమైన వెండి ధర కిలో రూ.72,300 పలుకుతుంది.
వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.45,260గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,380గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని అయిన ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,970 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,970గా ఉంది.
ప్లాటినం ధరలో స్వల్ప తగ్గుదల
ఇక సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర కొద్ది రోజులుగా స్వల్ప తగ్గుదల కనిపించింది. ప్లాటినం ధర గ్రాముకు రూ.67 తగ్గింది. హైదరాబాద్లో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.24,100 గా ఉంది. విశాఖపట్నంలో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.24,100గా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడం ఓ కారణం. అయితే, ఇలా గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయ కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల కూడా బంగారం ధరలపై ప్రభావం చూపిస్తాయి.