మన దేశంలో బంగారం ధరల పెరుగుదల లేదా తగ్గుదల అనేది పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం ఓ కారణం. అయితే, ఇలా గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయ కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో ఫ్యాక్టర్స్ బంగారం ధరను నిర్ణయిస్తాయి. ఏపీ, తెలంగాణలోని ముఖ్య నగరాల్లో తాజా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.


భారత్‌లో బంగారం ధర ఈ రోజు (ఆగస్టు 5) స్థిరంగా కొనసాగుతోంది. ఆగస్టు 4న రూ.44,990 ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర, ఇవాళ (ఆగస్టు 5) కూడా ఆ ధరలోనే కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా ముందురోజు రూ.48,980 గా ఉండగా.. నేడు అలాగే ఉంది. రోజూ బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తూ ఉండగా తాజాగా బంగారం ధర స్థిరంగా ఉంది. మొత్తానికి గత 10 రోజుల ధరలతో పోలిస్తే సుమారు రూ.200 మేర పెరిగింది.


బంగారం ధరలు స్థిరంగా ఉండగా వెండి ధరలు మాత్రం కాస్త పెరిగాయి. వెండి ధరల్లో గత 10 రోజులుగా హెచ్చుతగ్గులు కనిపిస్తూనే ఉన్నా.. తాజాగా భారత్‌లో కిలో వెండి ధర రూ.73,100 గా ఉంది. నిన్న (ఆగస్టు 4న) రూ.72,700గా ఉంది. నిన్నటితో పోలిస్తే వెండి ధర తాజాగా రూ.400 వరకూ పెరిగింది.


హైదరాబాద్, విజయవాడల్లో బంగారం, వెండి తాజా ధరలివీ..
హైదరాబాద్‌లో కూడా 24 క్యారెట్ల మేలిమి బంగారం (బిస్కెట్ బంగారం) ధర రూ.48,980 గానే స్థిరంగా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.44,900 గానే కొనసాగుతోంది. స్వచ్ఛమైన వెండి ధర కిలో రూ.73,100 పలుకుతుండగా.. ముందు రోజుతో పోలిస్తే వెండి ధర రూ.400 పెరిగింది.


ఇక విజయవాడలో 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ఆగస్టు 5న రూ.44,900 కాగా.. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.48,980గా ఉంది. విజయవాడలో ఆగస్టు 4న గ్రాముకు రూ.9 వరకూ తగ్గిన బంగారం ధర తర్వాతి రోజు కూడా అదేలా కొనసాగింది. ఇక్కడ కిలో వెండి ధర రూ.73,100గా ఉండగా.. వెండి ధర కిలోకు రూ.400 వరకూ పెరిగింది. విశాఖపట్నంలోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,900 గానే ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,980గా ఉంది. వెండి ధర కూడా కిలోకు రూ.73,100కు పెరిగింది. 


వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.45,360ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,500గానే కొనసాగుతోంది. దేశ వాణిజ్య రాజధాని అయిన ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,380 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,380గానే కొనసాగుతోంది.


ప్లాటినం ధరలో స్వల్ప తగ్గుదల
ఇక సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర కొద్ది రోజులుగా స్వల్ప తగ్గుదల కనిపించింది. ప్లాటినం ధర గ్రాముకు రూ.19 తగ్గింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.24,870 గా ఉంది. విశాఖపట్నంలో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.24,870గా ఉంది.