LPG Price Hike: భారత్‌లో వాహనదారులకు, గృహిణులకు ఆందోళన కలిగించే వార్త ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. గత దాదాపు నాలుగేళ్లుగా స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలలో త్వరలోనే మార్పులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు ముడిచమురు ధరలను ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ క్రమంలో దేశీయ చమురు మార్కెటింగ్‌ కంపెనీలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడిని తగ్గించేందుకు ప్రభుత్వం ఇంధన ధరల సవరణకు సిద్ధమవుతోంది. 

Continues below advertisement

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, పెట్రోల్, డీజిల్‌ ధరలను లీటర్‌కు రూ. 4 నుంచి ఐదు రూపాయలు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. కేవలం వాహనదారులపై కాకుండా వంట గ్యాస్‌ వినియోగదారులపై కూడా భారం పడనుంది. గృహ అవసరాలకు వాడే ఎల్‌పీజీ సిలిండర్‌ ధఱ సుమారు 40 నుంచి 50 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది. 2022 నుంచి రిటైల్ ఇంధన ధరలలో ఎటువంటి పెద్ద మార్పులు చేయలేదు. 

Also Read: భారత్‌లో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు! సామాన్యులపై పెను భారం!

ధరల పెంపునకు కారణాలు ఏంటీ? 

పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి వల్ల గ్లోబల్ క్రూడ్ ఆయిల్ మార్కెట్‌ అస్థిరంగా మారింది. ఇది భారత్ వంటి దిగుమతులై ఆధారపడే దేశంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగినప్పటికీ, దేశీయంగా రిటైల్ ధరలను పెంచకపోవడంతో ఇండియన్ ఆయిల్‌, హెచ్‌పీసీఎల్ వంటి కంపెనీలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. పెరిగిన ఖర్చులను వినియోగదారులకు బదిలీ చేయకపోవడం వల్ల వారిపై భారం పెరుగుతోంది. చమురు ధరలను నియంత్రణలో ఉంచడానికి ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు ప్రభుత్వ ఖజానాపై అదనపు భారాన్ని పెంచుతున్నాయి. దీని వల్ల బడ్జెట్‌ లక్ష్యాలను చేరుకోవడం కష్టతరమవుతోంది. 

Continues below advertisement

Also Read: హైవేలపై క్యూలకు స్వస్తి! భారత్‌లోనే తొలి బారియర్ లెస్‌ టోల్‌ ప్లాజా ప్రారంభం!

పెంపు బాంబు ఎప్పుడు పేలుస్తారు?

ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వర్గాల సమాచారం ప్రకారం, ఈ ప్రతిపాదిత ధరల పెంపుపై రాబోయే 5 నుంచి 7 రోజుల్లో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అంతర్గత చర్చలు జరుగుతున్నాయని, ద్రవ్యోల్బణంపై దీని ప్రభావం కనీస స్థాయిలో ఉండేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోందని సమాచారం. 

Also Read: కోట్లు విలువ చేసే మెర్సిడెస్ బెంజ్ వి-క్లాస్ లో కార్తీక్ ఆర్యన్ షికారు.. లగ్జరీ కార్ల కలెక్షన్ లో మరో డైమండ్.. స్టైల్ కు కంఫర్ట్ తోడైతే..

ధరల పెంపు అనేది ఒక సున్నితమైన అంశం. ముఖ్యంగా ఆహారపు వస్తువుల ధరలు ఇప్పటికే ఎక్కువగా ఉన్న సమయంలో, ఇంధన ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. అందుకే ప్రభుత్వం క్వాలిబ్రేటెడ్‌ హైక్ అంటే దశలవారీగా లేదా నియంత్రిత పద్ధతిలో ధరలను పెంచడం ద్వారా ద్రవ్యోల్బణం అదుపు తప్పకుండా చూడాలని భావిస్తోంది.

Also Read: మైలేజ్ ఇచ్చే బెస్ట్ మిడ్ సైజ్ ఎస్‌యూవీలు ఇవే! లీటర్ కు 28 కిమీ ఇచ్చే హైబ్రిడ్ కార్ల లిస్ట్

ప్రభుత్వం ప్రస్తుతం ఒక క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఒకవైపు చమురు కంపెనీల ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటం మరోవైపు సామాన్య వినియోగదారుడిని ద్రవ్యోల్బణం నుంచి రక్షించడం మధ్య సమతుల్యత పాటించాల్సి ఉంది. రాబోయే కొద్ది రోజులు అంతర్జాతీయ చమురు మార్కెట్‌ కదలికలు, పశ్చిమాసియా ఉద్రిక్తతలు భారత ఇంధన ధరల భవిష్యత్‌ను నిర్ణయించనున్నాయి. వినియోగదారులు తమ నెలవారీ బడ్జెట్‌లో మార్పులకు సిద్ధంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పవచ్చు.