భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం రోజు రోజుకు పెరుగుతోంది. వీటి వినియోగం నగరాలు, పట్టణాల నుంచి ఇప్పుడు గ్రామ స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆయా టూ వీలర్ కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. తాజాగా ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ HERO, మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ నేపథ్యలో కొత్త స్కూటర్ కు సంబంధించిన టీజర్ ను విడుదల చేసింది.  ఈ స్కూటర్ లుక్ చూస్తే ఇప్పటికే అమ్మకాలు జరుపుకుంటున్న ఆప్టిమా మాదిరిగా కనిపిస్తోంది. ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను మార్చి 15న మార్కెట్లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.






లేటెస్ట్ టెక్నాలజీ, అదిరిపోయే ఫీచర్లు  


హీరో నుంచి రాబోతున్న స్కూటర్ కు సంబంధించి పలు వివరాలు అందుబాటులోకి వచ్చాయి. స్కైటర్ ఫ్రంట్ కౌల్ పైభాగంలో ఉండే ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. దానికి సెంటర్ లో ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్స్ ను కలిగి ఉంది. ఇవి స్కూటర్ కు అదిరిపోయే లుక్ ఇవ్వనుంది. హెడ్ ల్యాంప్, టర్న్ ఇండికేటర్ డిజైన్ ను చూస్తుంటే హీరో ఆప్టిమా మాదిరిగానే కనిపిస్తోంది.  ఈ స్కూటర్ అల్లాయ్ వీల్స్ తో వస్తోంది. అంతేకాదు, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ను కలిగి ఉంటుంది. కర్వీ సీట్, బ్లూ పెయింట్ థీమ్‌ తో కూడిన అల్లాయ్ వీల్స్‌ తో ఈ స్కూటర్ చాలా ఆకట్టుకునేలా ఉంది. కంపెనీ అధికారికంగా విడుదల రోజు అన్ని వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.   


హీరో 8వ ఎలక్ట్రిక్ స్కూటర్ గా మార్కెట్లోకి


హీరో ఎలక్ట్రిక్ కంపెనీ ఇప్పటికే 7 మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. తాజా స్కూటర్ ఎనిమిదవది కానుంది. ప్రత్యర్థి కంపెనీలకు దీటుగా ఈ వాహనాన్ని రూపొందిచినట్లు తెలుస్తోంద. దేశంలో ప్రస్తుతం పెట్రో వాహనాల వినియోగం తగ్గుతోంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు.  


జనవరితో పోల్చితే తగ్గిన అమ్మకాలు


ఇక హీరో ఎలక్ట్రిక్ కంపెనీ ఫిబ్రవరి 2023లో దేశ వ్యాప్తంగా 5,861 యూనిట్లను అమ్మింది.  జనవరితో పోల్చితే ఫిబ్రవరిలో అమ్మకాలు తగ్గాయి. జనవరిలో 6,393 యూనిట్లను అమ్మింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హీరో కంపెనీ ఇప్పటి వరకు 80,954 యూనిట్లను అమ్మింది. ఇక ఈ వాహనాలు FAME-II స్కీమ్ సబ్సిడీ ప్రకారం అందుబాటులో ఉన్నాయి.   


దేశ వ్యాప్తంగా పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం


ప్రస్తుతం పర్యవరణ హితమైన ప్రయాణం పట్ల వాహనదారులు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజు రోజుకు పెరుగుగోంది. ప్రస్తుతం దేశంలో ఎక్కువ రేంజ్ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ గా బ్రిస్క్ కొనసాగుతోంది. ఒక్క చార్జ్ తో 300కుపైగా కిలోమీటర్లు ప్రయాణించే అవకాశం ఉంటుంది.  ఇటీవలే హైదరాబాద్ లో ఈ స్కూటర్ ను ఆవిష్కరించారు.   


Read Also: మహీంద్రా ఎలక్ట్రిక్ రిక్షా నడిపిన బిల్ గేట్స్, ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే?