Manchu Lakshmi Vs Ysrcp :  మంచు లక్ష్మి మీద  ఏపీ సీఎం జగన్ ఫ్యాన్స్  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమెపై విరుచుకుపడుతున్నారు. దీనికి కారణం మంచు లక్ష్మి ఓ పోస్ట్ షేర్ చేస్తూ చేసిన కామెంటే. ఇంతకూ ఆమె ఏం పోస్ట్ షేర్ చేశారు..? ఏం కామెంట్ చేశారో మీరే చూడండి. 





కొన్నాళ్ల క్రితం సీఎం జగన్ ఢిల్లీలో జరిగిన ఓ సమావేశానికి వెళ్లారు. ముందువరుసలో కూర్చొన్న సీఎం జగన్ అక్కడకు వచ్చిన వారికి స్మైల్ చేస్తూ పలకరించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. బీ లైక్ అంటూ..  ఎగ్జామ్ హాల్‌లో క్వశ్చన్ పేపర్ చూశాకా నా పరిస్థితి.. సీరియస్ మీటింగ్‌లో ఉన్నప్పుడు కడుపులో గిరగిరా తిరిగితే... ఎలా ఉంటుందంటే అంటూ వీడియో మీమ్స్ పెడుతున్నారు. ఇలాంటి వాటిలో ఒకటి షేర్ చేసిన మంచు లక్ష్మి .. మరింత  లోల్ అంటూ ట్రోల్  కామెంట్ పెట్టింది. ఇది వైసీపీ అభిమానులకు నచ్చలేదు. ఆమెపై దండయాత్ర చేస్తున్నారు. 





మంచు లక్ష్మి షేర్ చేసిన పోస్ట్ కూడా తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులదే. అందుకే వైఎస్ఆర్‌సీపీ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 





కొంత మంది తెలుగుదేశం పార్టీ ఫ్యాన్స్ ఆమెను సమర్థిస్తూ పోస్టులు పెడుతున్నారు. 
 





 మంచు లక్ష్మి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు కానీ.. సహజంగా వివాదాస్పద అంశాల జోలికి పోరు.  మహిళా సమస్యలకు సంబంధించిన అంశాలపై అగ్రెసివ్‌గా స్పందిస్తారు. లేకపోతే.. సొంత పోస్టులు ఎక్కువగా పెట్టుకుంటారు. కానీ హఠాత్తుగా సీఎం జగన్‌ను ట్రోల్ చేసేలా ఓ పోస్టును రీ ట్వీట్ చేసి.. కామెడీగా "లోల్" కామెంట్ పెట్టడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.  నిజానికి మంచు విష్ణుకు జగన్ దగ్గరి బంధువు. మోహన్ బాబు వైసీపీ నేత. అయినా కూడా మంచు లక్ష్మి ఇలా ట్రోల్ చేయడం చర్చనీయాంశం అవుతోంది.