YS Sharmila sent Christmas gifts to Lokesh: అమరావతి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) కు అదిరిపోయే క్రిస్మస్ గిఫ్ట్ వచ్చింది. ఎందుకంటే ఆ క్రిస్మస్ కానుకను వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అందించారు. క్రిస్మస్ ను పురస్కరించుకుని లోకేష్ కు షర్మిల కానుక (Sharmila Christmas gifts)ను పంపించారు. వైఎస్సార్ ఫ్యామిలీ నుంచి లోకేష్ కుటుంబానికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ నోట్ పంపించారు. షర్మిల పంపిన క్రిస్మస్ కానుకను అందుకున్న లోకేష్ చాలా సంతోషించారు. తనకు క్రిస్మస్ కానుక పంపిన షర్మిలకు లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. తన ఫ్యామిలీ తరఫున షర్మిలకు, ఆమె కుటుంబసభ్యులకు క్రిస్మస్ తో పాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు లోకేష్ సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేశారు.






నారా లోకేష్ క్రిస్మస్ శభాకాంక్షలు


'ప్ర‌భువైన ఏసు క్రీస్తు ఆచ‌రించిన‌ ప్రేమ‌, క‌రుణ‌,స‌హ‌నం ప్ర‌తీ ఒక్క‌రిలో పెంపొందాలి. క‌రుణామ‌యుడైన క్రీస్తు  మ‌న‌కు అందించిన శాంతి సందేశం స‌మాజానికి పంచి ప్ర‌పంచ‌శాంతికి దోహ‌ద‌ప‌డాలి. క్రీస్తు చూపిన మార్గ‌మైన ద‌య, త్యాగ‌గుణం ప్ర‌తీ ఒక్క‌రూ అల‌వ‌ర్చుకున్న‌ప్పుడే జీవితం సంతోష‌మ‌యం అవుతుంది. క్రిస్మ‌స్ సంద‌ర్భంగా క్రైస్త‌వులంద‌రికీ శుభాకాంక్ష‌లు. ద‌యామ‌యుడు లోకానికి వ‌చ్చిన ప‌ర్వ‌దిన‌మైన క్రిస్మ‌స్ పండ‌గ‌ని  ఆనందోత్సాహాల‌తో జ‌రుపుకోవాల‌ని ఆకాంక్షిస్తున్నాను' అని నారా లోకేష్ విషెష్ తెలిపారు.