Ys Bharathi Welcomes CM Jagan: ఎన్నికల నేపథ్యంలో ఏపీలో రాజకీయ పార్టీల ప్రచారం ఊపందుకుంది. మరోసారి అధికారమే లక్ష్యంగా సీఎం జగన్ (CM Jagan) ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఆదివారం గుంటూరు జిల్లాలోని తాడేపల్లికి (Tadepalli) సీఎం వైఎస్ జగన్ 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన బస్సు యాత్రలో అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. సీఎం జగన్ బస్సు యాత్ర తాడేపల్లికి జంక్షన్ కు చేరుకోగానే.. ఆయన సతీమణి వైఎస్ భారతి (Bharathi) జగన్ కు అభివాదం చేశారు. ప్రజలు, అభిమానుల మధ్య నుంచే ఆమె అభివాదం చేయగా.. ప్రతిగా బస్సులో నుంచి సీఎం జగన్ ఆమెకు అభివాదం చేశారు. ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. అక్కడి వారు వైఎస్ భారతితో ఫోటోలు, సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. అభిమానులతో సరదాగా ముచ్చటించిన ఆమె.. వైసీపీకి మద్దతుగా నిలవాలని కోరారు.








ప్రకాశం బ్యారేజీపై..


అనంతరం, సీఎం జగన్ బస్సు యాత్ర విజయవాడ చేరుకుంది. ఈ క్రమంలో ప్రకాశం బ్యారేజీపై చేరుకున్న బస్సు యాత్రను చూసేందుకు అభిమానులు, వైసీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. జగన్ కు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.


Also Read: Jagan : ఇంటి స్థలాలివ్వకుండా అడ్డుకుంది చంద్రబాబే - మంగళగిరి చేనేతల సమావేశంలో జగన్ విమర్శలు