Helpline Numbers for Visakhapatnam Rayagada Passenger train accident


విజయనగరం: ఏపీలోని విజయనగరం జిల్లాలో ఎక్స్ ప్రెస్ రైలు, ప్యాసింజర్ రైళ్లు ఢీకొనడంతో విషాదం నెలకొంది. చినరావుపల్లి వద్ద రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో కనీసం ఏడుగురు మృతిచెందగా, దాదాపు వంద మంది గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడ్డ వారిని చికిత్స కోసం ఆసుపత్రులకు అంబులెన్స్ లలో తరలిస్తున్నారు. రైలు ప్రమాద బాధితుల సహాయం కోసం, సమాచారం అందించడం కోసం విజయనగరం కలెక్టర్ స్ నాగలక్ష్మి కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు.
- బాధితుల సహాయ సమాచారం కోసం కలెక్టర్ కార్యాలయంలో 9493589157 తో హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు
- బాధితుల సహాయ సమాచారం కోసం ఏర్పాటు చేసిన రైల్వే హెల్ప్ లైన్ నంబర్ 8978080006 కు కాల్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు అని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి సూచించారు.


రాయగడ ఎస్ ప్రెస్ రైల్ ప్రమాదం ఘటనపై విశాఖ రైల్వే స్టేషన్ లో హెల్ప్ లైన్ ఏర్పాటు.
హెల్ప్ లైన్ నెంబర్లు ఇవే
0891 2746330, 08912744619
ఎయిర్ టెల్
81060 53051
8106053052
బీఎస్ ఎన్ ఎల్ 
8500041670
8500041671


విశాఖలో హెల్ప్ లైన్ నెంబర్లు ఇవీ.. 
విశాఖపట్టణం: విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి, చినరావుపల్లి వద్ద రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొనడంతో విషాదం నెలకొంది. ఈ రైలు ప్రమాదం ఘటనలో బాధితుల వైద్య సహాయార్థం విశాఖపట్టణం K.G.H.లో హెల్ప్ లైన్ నంబర్స్ ను జిల్లా కలెక్టర్ డా. ఎ.మల్లిఖార్జున ఏర్పాటు చేశారు. 
విశాఖ కేజీహెచ్ లో హెల్ప్ లైన్ నెంబర్స్ ఇవే..
1. కేజీహెచ్ casuality No.8912558494
2. Doctor at కేజీహెచ్ మొబైల్ No. 8341483151 (24 hrs available)
3. Doctor at కేజీహెచ్ casuality మొబైల్ No.8688321986 (24 hrs available)
బాధితుల వైద్య సహాయం కోసం పైన పేర్కొన్న ఫోన్ నంబర్లకు ఫోన్ చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జున విజ్ఞప్తి చేశారు.


విశాఖ నుంచి పలాస వెళ్తున్న ప్యాసింజర్‌ రైలు కొత్తవలస మండలం అలమండ-కంటకాపల్లి వద్ద సిగ్నల్‌ వద్ద ఆగి ఉంది. అదే లైనులో వెళ్తున్న విశాఖ-రాయగడ రైలు.. పలాస వెళ్తున్న ప్యాసింజర్‌ రైలును ఢీ కొట్టింది. రైళ్లు ఢీకొన్న విషయాన్ని రైల్వే బోర్డు గ్రూపులో డీఆర్‌ఎం సౌరబ్ ప్రసాద్‌ సమాచారం ఇచ్చారు.