Alluri Sitarama Raju District News: అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా సీతంపేట ఏజెన్సీలో గిరిజనలు వారి పండగలు చూస్తే వింతగా కనిపిస్తాయి. జనవరి నెలలో వచ్చే సంక్రాంతిని ఒక్కొక్కరు ఒక్కోలా జరుపుకుంటారు. అయికే గిరిజనులు మాత్రం దీన్ని విత్తనాల పండుగ అని పిలుస్తారు. పంటలు బాగా పండాలి, ఆరోగ్యం బాగుండాలని కొండ దేవతకు పూజలు చేస్తారు. తెల్లవారుజాము నుంచి ఇంటి ముందు ముగ్గులు వేసి కొన్ని ఆహార పదార్థాలు తయారు చేసి కొండ దేవతకు నైవేద్యంగా పెడతారు. వారు వాడే వస్తువులన్నీ అమ్మవారి దగ్గర పెట్టి పూజలు చేస్తారు. అన్నం వండి వచ్చిన గంజిలో స్థానికంగా పండే పంటలు, పండ్లు కలిపి పానకం తయారు చేస్తారు. దాన్ని అక్కడే ప్రసాదంగా తీసుకుంటారు. అరిటాకుల్లో లేదా గుమ్మడి కాయలో వేసి తాగుతారు. దాని వల్ల అనారోగ్యాలు దరి చేరవని నమ్మకం. పంటలు బాగా పండి సంతోషాలతో ఉండాలని డప్పులు డోలుతో నృత్యాలు చేసుకుంటూ వారి భాషలో పాటలు పాడి సందడి చేస్తారు. బంధువులను కూడా పిలుచుకొని ఎంతో ఆనందోత్సవాలతో ఈ పండగలు నిర్వహిస్తారు..
Also Read: మనోజ్కు షాక్ ఇచ్చిన మోహన్ బాబు - తన ఆస్తుల నుంచి గెంటివేత !
పితృ కర్మ పూజలు.కుటుంబంలో చనిపోయిన వ్యక్తులు వల్ల ఆత్మలు శాంతించాలని కూడా పూజలు చేస్తారు. అయితే వస్తువులన్నీ కూడా కొండ దేవతకు పెడతారు. అక్కడే పెద్దల ఆత్మల కోసం ఒక రాయి రూపంలో పెట్టి పూజలు చేస్తారు. ఇది చూడ్డానికి విడ్డూరంగా ఉన్న వారు మాత్రం అక్కడ అదే దైవం కింద పూజిస్తారు. కొండ దేవతను నమ్ముకున్న వారికి అన్యాయం జరగదని గిరిజనులు చెబుతున్నారు. గిరిజనుల్లో ఈ పండగ నెలరోజుల పాటు జరుగుతూ ఉంటుంది.
వేడుకలో భాగంగా విత్తనాలు శుద్ధి పూజా కార్యక్రమం చేస్తారు. విత్తనాలను ఆ దేవుడి దగ్గర పెట్టి అనంతరం పెద్దలకు చూపిస్తారు. పంటలు సుభిక్షంగా పండాలని ఇబ్బందులు రాకుండా ఉండాలి మొక్కులు చెల్లించుకుంటారు. తయారు చేసుకున్న పిండి వంటలు ఆరగిస్తూ నృత్యాలతో సందడిగా గిరిజన గ్రామాల్లో పండగలు చేసుకుంటారు.
ప్రధానంగా వీళ్ళు కంది, పెసర గింజలు వడ్లను ఉడికించి వాటితో నైవేద్యం పెడతారు. వాటిని ఇంటిలిపాది శుద్ధి చేసి ఇంట్లో జల్లిన తర్వాత ఇంటి బయట మట్టిలో పెడతారు. మొక్కలు మొలిచిన తర్వాత మంచి విత్తనాలుగా నిర్ధారించి పొలంలో వేస్తారు. ప్రధానంగా కెమికల్స్ వాడకుండా సేంద్రీయ వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు.
మాంసాహారం లేనిదే ముద్ద దిగని గిరిజనం అంతా ఈ పండగ జరిపే రోజుల్లో మాంసాహారానికి దూరంగా ఉంటారు. విత్తనాలు శుద్ధి చేసిన దేవుడికి పెట్టిన తర్వాత మాత్రమే మాంసాహారాలు తినడం ప్రారంభిస్తారు. పండగ జరిగే రోజుల్లో మాంసానికి మద్యానికి దూరంగా ఉంటారు. ఆ తర్వాతే బంధువులందరినీ పిలుచుకొని పండగ అంగరంభ వైభవంగా చేస్తారు.
ఆచారం ప్రకారం..పండగ టైంలో వేరే ప్రాంతం వాళ్లు గ్రామాల్లోకి వస్తే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకే ఉండనిస్తారు. ఆ తర్వాత గ్రామం విడిచి వెళ్లిపోవాలి. లేకుంటే పండగ పూర్తి అయ్యే వరకు అదే ఊరిలో ఉండాలి. ఇది వాళ్ళ సంప్రదాయంగా కొనసాగిస్తూ ఉంటారు. ఇతర ప్రాంతాల నుంచి ఆ ప్రాంతాలకు వెళ్లిన కొందరు వ్యక్తులు ఇలానే ఉండిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఎవరైనా సాయంకాలం దాటి వెళ్లిపోతే వీళ్ళ లాభనష్టాలు వెళ్లిపోతాయని నమ్మకం.
Also Read: నిన్న మహాసేన రాజేష్, ఇవాళ శ్రీనివాస్ రెడ్డి - లోకేష్ను డిప్యూటీ సీఎం చేయయాాలని డిమాండ్ - ప్లానేనా ?