Andhra Pradesh: వరుస పండుగులు వస్తున్న వేళ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈస్ట్ కోస్ట్ రైల్వే ఏపీలో ప్రముఖ పుణ్యక్షేత్రాలకు నగరాలకు ప్రత్యేక రైళ్ళు ప్రకటించింది. ముఖ్యంగా తిరుపతి, శబరిమల, చెన్నై ఎగ్మోర్, సికింద్రాబాద్ వెళ్లే ప్రయాణికుల కోసం ఈ స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేసింది.


విశాఖ పట్నం - తిరుపతి - విశాఖపట్నం స్పెషల్ ట్రైన్ 


1) విశాఖపట్నం నుంచి తిరుపతి వెళ్ళే ఈ వీక్లీ స్పెషల్ ట్రైన్ (నెంబర్ 08583) 02.09.24 నుంచి 25.11.24 వరకూ ప్రతీ సోమవారం రాత్రి 7 గంటలకు వైజాగ్‌లో బయల్దేరనుంది. మరుసటి రోజు ఉదయం 9:15కు తిరుపతి చేరుకుంటుంది. ఈ ట్రైన్‌లో ఒక 2nd AC, ఏడు 3rd AC, 3rd AC (ఎకానమీ)-1, స్లీపర్ క్లాస్‌లు 6, జనరల్ క్లాస్‌లు 4 ఉంటాయి.


2) తిరుపతి - వైజాగ్ వీక్లీ (08584)
తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ 03.09 2024 నుంచి 26.11.2024 వరకూ ప్రతీ మంగళవారం అందుబాటులో ఉంటుంది. రాత్రి 9:55కు తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.15కు వైజాగ్ చేరుకుంటుంది.


ఈ వీక్లీ ట్రైన్స్ ఆగే స్టేషన్లు 
దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి,చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహ్తస్తి, రేణిగుంట


విశాఖ పట్నం - సికింద్రాబాద్ - విశాఖపట్నం వీక్లీ ఎక్స్ ప్రెస్
1) విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్ళే ఈ వీక్లీ స్పెషల్ ట్రైన్ (నెంబర్ 08579) 04.09.24 నుంచి 27.11.24 వరకూ ప్రతీ బుధవారం అందుబాటులో ఉంటుంది. రాత్రి 7 గంటలకు వైజాగ్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9:05కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ ట్రైన్‌లో ఒక 2nd AC, ఐదు 3rd AC, 10 స్లీపర్ క్లాస్‌లు, 5 జనరల్ క్లాస్‌ బోగీలు ఉంటాయి. 


2) తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళే ఈ వీక్లీ స్పెషల్ ట్రైన్ (నెంబర్ 08580) 05.09.24 నుంచి 28.11.24 వరకూ ప్రతీ గురువారం అందుబాటులో ఉంటుంది. రాత్రి 7:40 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9:15కు వైజాగ్ చేరుకుంటుంది.


ఈ వీక్లీ ట్రైన్స్ ఆగే స్టేషన్లు 
దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌను, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, మిర్యాలగూడ, నల్గొండ.



వైజాగ్ - శబరిమల (కొల్లం)  - వైజాగ్ వీక్లీ ట్రైన్


1) వైజాగ్ నుంచి కొల్లం వెళ్లే ఈ ట్రైన్ (నెం 08539) 04.09.11 నుంచి 27.11.2024 వరకూ ప్రతీ బుధవారం అందుబాటులో ఉంటుంది. రాత్రి 08.20కు వైజాగ్‌లో బయలుదేరి గురువారం మధ్యాహ్నం 12:55కు కొల్లం చేరుకుంటుంది.


2) తిరుగు ప్రయాణంలో కొల్లం- వైజాగ్ వీక్లీ ట్రైన్ (నెంబర్ .08540) 05.09.2024 నుంచి 28.11.2924 వరకూ అందుబాటులో ఉంటుంది. ప్రతీ గురువారం రాత్రి 19:35కు కొల్లంలో బయలుదేరి శుక్రవారం రాత్రి 11:20కు వైజాగ్ చేరుకుంటుంది. 


ఈ ట్రైన్ ఆగే స్టేషన్ ల లిస్ట్
దువ్వాడ,ఎలమంచిలి,సామర్లకోట,రాజమండ్రి,ఏలూరు, విజయవాడ, తెనాలి, బాపట్ల, ఒంగోలు, సింగరాయకొండ, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పడి జోలార్ పేట, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూర్, పాలక్కడ్, త్రిస్సుర్, ఆలువ, ఎర్నాకులం, కొట్టాయం, చెంగన్నూరు కాయంకులం, కరునాగప్పల్లి, సస్థనకొట్ట.


Also Read: వంట గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ - సెప్టెంబర్‌లో మీరు గుడ్‌న్యూస్‌ వినొచ్చు!


వైజాగ్ - చెన్నై ఎగ్మోర్ - వైజాగ్ వీక్లీ 


1) వైజాగ్ - చెన్నై వీక్లీ ఎక్స్ ప్రెస్ (నెంబర్ 08557) 07.09.2024 నుంచి 30.11.2024 వరకూ ప్రతీ శనివారం అందుబాటులో ఉంటుంది. రాత్రి 7 గంటలకు వైజాగ్‌లో బయలుదేరి ఆదివారం ఉదయం 8:45కు చెన్నై ఎగ్మోర్ చేరుకుంటుంది.


2)  చెన్నై ఎగ్మోర్ - వైజాగ్ వీక్లీ ఎక్స్ ప్రెస్ ( నెంబర్  08558) 08.09.11 నుంచి 01.12.2024 వరకూ ప్రతీ ఆదివారం అందుబాటులో ఉంటుంది.  ఉదయం 10:30కు బయలుదేరి అదేరోజు రాత్రి 10:35 కు వైజాగ్ చేరుకుంటుంది.


ఈ ట్రైన్లో ఒక 1st AC, రెండు 2nd AC, నాలుగు 3rd AC, రెండు 3rd AC (ఏకానమీ ), స్లీపర్ క్లాస్లు-06, జనరల్ క్లాస్ లు 3 ఉంటాయి.


ఈ ట్రైన్స్ ఆగే స్టేషన్ లు
దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు


తిరుమల ఎక్స్ ప్రెస్‌కు నందలూరు హాల్ట్ పొడిగింపు.
ఈ స్పెషల్ ట్రైన్స్‌తోపాటు విశాఖపట్నం నుంచి కడప వెళ్లే తిరుమల ఎక్స్ ప్రెస్ (17488/17487) కు నందలూరు హాల్ట్ పొడిగించారు. మరో ఆరునెలల పాటు స్పెషల్ హాల్ట్‌ను పొడిగించింది ఈస్ట్ కోస్ట్ రైల్వే. విశాఖ నుంచి కడప వెళ్లే ట్రైన్ 06:14కు నందలూరు చేరుకుంటుంది. కడప నుంచి వైజాగ్ వచ్చే ట్రైన్ 18:09కు నందలూరులో ఆగుతుందని అధికారులు తెలిపారు..


Also Read: సెప్టెంబర్ ఏడున ఏపీలో మద్యం షాపుల బంద్! ఎందుకంటే?