Vizag G20 Summit:
వివిధ దేశాలకు చెందిన 200 మంది ప్రతినిధులు
పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. ఈ సదస్సుకు వివిధ దేశాలకు చెందిన 200 మంది ప్రతినిధులు రానున్నాదని, వారి కి కావలసిన రవాణా, వసతి, భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. సదస్సు నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా విదేశీ ప్రతినిధులు పర్యటించే ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసినట్లు తెలిపారు. 46 కిలోమీటర్ల బిటి రోడ్డు పనులు, 24 కిలోమీటర్ల పెయింటింగ్ పనులు, పది కిలోమీటర్ల ఫుట్ పాత్ నిర్మాణం శాశ్వత ప్రాతిపదికన పూర్తి చేసినట్లు తెలిపారు. విశాఖ నగరం దేశంలోనే సుందర నగరంగా నిలుస్తుందని తెలిపారు.
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ సదస్సుకు జి 20 దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ కి చెందిన దేశాలు కూడా పాల్గొంటున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 28వ తేదీన ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారని, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమావేశాలను లాంఛనంగా ప్రారంభిస్తారన్నారు. ఈ సదస్సుకు విచ్చేసే విదేశీ ప్రతినిధులకు రాష్ట్ర సమాచారాన్ని పూర్తిగా అందిస్తామని, పెట్టుబడులకు గల అవకాశాలు గూర్చి తెలియజేస్తామన్నారు.
ఈ సమావేశంలో స్పెషల్ సి ఎస్ వై. శ్రీలక్ష్మి, ఎంఏడి డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, జిల్లా కలెక్టర్ ఎ.మల్లిఖార్జున, కమిషనర్ ఆఫ్ పోలీస్ సిహెచ్ శ్రీకాంత్, జీవీఎంసీ కమిషనర్ రాజబాబు, పార్లమెంట్ సభ్యులు ఎం వి వి సత్యనారాయణ, మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, శాసనసభ్యులు అవంతి శ్రీనివాసరావు, తిప్పల నాగిరెడ్డి హాజరయ్యారు