CII Vizag Investors Summit: సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొనేందుకు  బుధవారం సాయంత్రం అన్నమయ్య జిల్లా రాయచోటి నుంచి నేరుగా విశాఖ  చేరుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో నిర్వహించే 30వ సి.ఐ.ఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ సన్నాహకాలపై అధికారులు, మంత్రులతో సమీక్షిస్తారు.   భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్ అమిత్ కళ్యాణితో సమావేశం అవుతారు. 

Continues below advertisement

 4 రోజుల పాటు వరుసగా వన్ టు వన్ భేటీలు, సమావేశాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలలో విశాఖ నుంచి పాల్గొననున్నారు. భాగస్వామ్య సదస్సుకు తరలివస్తున్న జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో  గురువారం వరుసగా సమావేశం అవుతారు.  నోవాటెల్ హోటల్ లో ఉదయం ‘ఇండియా–యూరోప్ బిజినెస్ రౌండ్‌టేబుల్ సమావేశం’లో పాల్గొనన్నారు. పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్’ – సస్టైనబుల్ గ్రోత్‌పై ప్రారంభ సెషన్ లో   మాట్లాడతారు.  తైవాన్, ఇటలీ, స్వీడన్, నెదర్లాండ్స్ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు ఉంటాయి. వైజాగ్ ఎకనామిక్ రీజియన్ పై జరిగే కార్యక్రమానికి, సి.ఐ.ఐ నేషనల్ కౌన్సిల్ నిర్వహించే ప్రత్యేక సమావేశానికి హాజరవుతారు. 

నవంబర్ 14న సిఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభం అవుతుంది. సదస్సుకు ముఖ్య అతిధిగా హాజరుకానున్న ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ హాజరవుతున్నారు. మొదటగా ఏపీ పెవిలియన్‌కు ప్రారంభోత్సవం ఉంటుంది. ఏఐ ఫర్ వికసిత్ భారత్  సెషన్‌లో సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్రసంగం చేస్తారు. సదస్సు నుంచే ఎపిలో డ్రోన్ సిటీ, స్పేస్ సిటీల ప్రారంభమవుతాయి. సింగపూర్ కు నేరుగా విమాన సర్వీసులపై ఒప్పందం, ఏపీ రీఇమేజినింగ్ పబ్లిక్ ఫైనాన్స్ సమ్మిట్‌’లో సీఎం ముఖ్య ప్రసంగం ఉంటుంది.  అలాగే విశాఖలో లులూ మాల్‌కు శంకుస్థాపన జరుగుతుంది. 

Continues below advertisement

 

నవంబర్ 15, శనివారం జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో సమావేశాలు ఉంటాయి.  గూగుల్, శ్రీ సిటీ, రేమండ్, ఇండోసోల్ వంటి ప్రాజెక్టుల శంకుస్థాపన కార్యక్రమాలు ఉంటాయి.  బహ్రెయిన్, న్యూజిలాండ్, జపాన్, కెనడా, మెక్సికో ప్రతినిధులతో సీఎం సమావేశం అవుతారు.  ‘గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ’, ‘సస్టైనబుల్ సిటీస్’, ‘ఆంధ్ర టూరిజం విజన్’ సెషన్లు జరుగుతాయి.  మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన ‘ఏఐ అండ్ ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్’పై ముఖ్య చర్చ కూడా ఉంటుంది.  ‘ఇన్వెస్టింగ్ ఫ్రమ్ అబ్రాడ్ : ఎన్ఆర్టీస్ ఫర్ వికసిత్ భారత్’ పై సీఎం సమీక్ష చేస్తారు.  సదస్పులో చివరిగా ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా బ్రీఫింగ్ ఉంటుంది. 

మొత్తంగా సదస్సులో 100కి పైగా అంతర్జాతీయ ప్రతినిధులతో సమావేశాలు, 30కి పైగా ఒప్పందాలపై సంతకాలు జరుగుతాయి.  అలాగే ఏఐ, స్పేస్, గ్రీన్ హైడ్రోజన్, టూరిజం, ఎంఎస్ఎంఈ, ఫైనాన్స్ రంగాలపై కీలక చర్చలతో పాటు  ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచడంతో పాటు, భారీఎత్తున రాష్ట్రానికి పెట్టుబడులు, యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా సదస్సు నిర్వహిస్తారు.  విశాఖ సమ్మిట్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేలా యంత్రాంగాన్ని సన్నద్ధం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు  రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడుల కు సంబంధించి ఒప్పందాలు జరిగేలా ఇప్పటికే గ్రౌండ్ ప్రిపేర్ చేశారు.  మ్మిట్ ను విజయవంతం చేసేందుకు ఇప్పటికే దేశ విదేశాల్లో పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తూ రోడ్ షోలు, పర్యటనలు చేశారు.